Chandrababu performs Bhoomi Puja for construction of house in Amaravati

CM Chandrababu : అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు

CM Chandrababu : రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల‌గ‌పూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌ , బ్రాహ్మణి, దేవాంశ్‌ పాల్గొన్నారు.

Advertisements
అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ

ఇటీవలే ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

గత ఏడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్‌ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1,455 చ.గజాల విస్తీర్ణంలో జి ప్లస్‌ 1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు.

కొన్నాళ్లు హైదరాబాద్‌లో నివాసం

రాజ‌ధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఆ ప్రాంతంలో సొంతిల్లు లేదు. విభజన తరువాత కొన్నాళ్లు హైదరాబాద్‌లో నివాసం ఉన్న చంద్రబాబు అనంతరం కరకట్ట ఒడ్డున అద్దెకు నివసిస్తున్న విషయం తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంపై చంద్రబాబు దృష్టి సారించారు. 2019 వరకు భూసేకరణ, డిజైన్లు, నిర్మాణాలు కొంత చేపట్టగా ఇప్పుడు వాటిపై పూర్తి దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిపై దృష్టి సారించారు.

Read Also: 11న ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు

Related Posts
భారత్‌లో చైనా వైరస్‌ తొలి కేసు
భారత్‌లో చైనా వైరస్‌ తొలి కేసు

బెంగుళూరులో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదు. బెంగళూరులో ఎనిమిది నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్యూమోవైరస్ (హెచ్ఎమ్పివి) వైరస్ ఉన్నట్లు గుర్తించారు. నివేదికల ప్రకారం, ఆ బిడ్డకు ఎటువంటి Read more

బోరుబావిలో పడ్డ బాలుడు మృతి
Five year old Aryan

రాజస్థాన్ , డిసెంబర్ 12,బోరుబావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు రెండు రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. విషాదకర సంఘటనగా మిగిలిపోయిన బాలుడి ఉదంతం రాజస్థాన్ Read more

శంషాబాద్ ఎయిర్పోర్టులో తప్పిన విమాన ప్రమాదం
శంషాబాద్ ఎయిర్పోర్టులో తప్పిన విమాన ప్రమాదం

హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో విమాన ప్రమాదం తప్పింది. ముంబై-విశాఖ ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా అనుకోని సమస్యను ఎదుర్కొంది. ఈ కారణంగా విమానంలో 144 మంది Read more

Dinner : రాత్రి భోజనం తర్వాత ఇలా చేయండి!
Dinner2

భోజనం అనంతరం కొంత సమయం నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలుకలిగిస్తుంది. వైద్యుల సూచనల ప్రకారం, రాత్రి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు నడవడం జీర్ణక్రియను వేగవంతం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×