Rains : మే చివరి నుంచే వర్షాలు పడే అవకాశం – స్కెమెట్

Read Time:  1 min
Hyderabad Rains తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
Hyderabad Rains తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
FONT SIZE
GET APP

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణంగానే ఉండే అవకాశం ఉందని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సుమారు 868.6 మిల్లీమీటర్లు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మే చివరి నుంచే కొన్ని ప్రాంతాల్లో వానలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

తెలంగాణలో అధిక వర్షపాతం – ఉమ్మడి జిల్లాలకు లాభం

తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాధారణ కంటే 30 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని స్కైమెట్ అంచనా వేసింది. ఇది వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు ఊరటనిచ్చే అంశం. వర్షాలు ముందుగానే మొదలవడం ద్వారా వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభం కావొచ్చు.

ఏపీలో కొంత లోటు వర్షపాతం

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని స్కైమెట్ చెబుతోంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మినహాయించి మిగిలిన జిల్లాల్లో వర్షపాతం లోటుగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇది అక్కడి రైతులకు కొంత ఆందోళన కలిగించే అంశమే అయినా, ముందు జాగ్రత్తలు తీసుకుంటే నష్టాలను తక్కువగా మార్చుకోవచ్చని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.