Latest News: TG TET 2026: టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

Read Time:  1 min
Latest News: TG TET 2026: టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం
FONT SIZE
GET APP

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ – జనవరి 2026)కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగులకు, అలాగే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కాని తమ ఉద్యోగాన్ని కొనసాగించాలంటే టెట్ అర్హత అవసరమై ఉన్న టీచర్లకు ఈ నోటిఫికేషన్ అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని స్పష్టత రావడంతో ఈ పరీక్ష ప్రాధాన్యత మరింత పెరిగింది.

Read Also: Weather: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌- జనవరి 2026 పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. పేపర్ 1 పరీక్ష ప్రాథమిక పాఠశాలలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారు రాయవల్సి ఉంటుంది. ఇక పేపర్ 2 పరీక్ష ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారికి నిర్వహిస్తారు.

పేపర్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు మాత్రం 45 శాతం ఉత్తీర్ణత సరిపోతుంది. అలాగే వీరు తప్పనిసరిగా D.El.Ed / B.El.Ed / D.Ed లేదా D.Ed స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ఉత్తీర్ణత ఉండాలి.

అభ్యర్ధులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత

ఇక పేపర్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ అభ్యర్ధులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బీఎడ్‌/ బీఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ లేదా B.A.Ed / B.Sc.Edలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. D.El.Ed / B.Ed చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా పరీక్ష రాయవచ్చు. టెట్‌ అనేది అర్హత పరీక్ష మాత్రమే కాబట్టి ఇందులో వయస్సు పరిమితి ఉండదు.

ఎవరైనా ఈ పరీక్ష రాయవచ్చు. టెట్ పరీక్షలో ఓసీ/ఈడబ్ల్యూఎస్‌లకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం మార్కులు వస్తే ఉత్తీర్ణత పొందినట్లు పరిగణిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పేపర్‌ 1 లేదా పేపర్‌ 2 ఏదైనా ఒక పరీక్షకు రూ.750, రెండు పేపర్లు రూ.1000 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇక హాల్‌ టికెట్లు డిసెంబర్‌ 27, 2025వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక టెట్ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జనవరి 3 నుంచి 31, 2026వ తేదీ వరకు జరుగుతాయి. ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీలోపు విడుదల చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.