Telugu News: Scholarship: ప్రభుత్వ స్కూల్, కాలేజీల బాలికలకు రూ.30వేల స్కాలర్ షిప్

Read Time:  1 min
Scholarship
Scholarship
FONT SIZE
GET APP

ప్రభుత్వ స్కూల్‌లో 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసిన బాలికలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం రూ.30వేల స్కాలర్‌షిప్ అందించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పేద మరియు ప్రతిభావంతులైన బాలికలకు ఆర్థిక సహాయం లభించనుంది.

ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, ఫౌండేషన్ తెలంగాణ హెడ్ ఎం. శ్రీనివాసరావు, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. గత ఏడాది రెండు, మూడు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా(pilot project) ప్రారంభించిన ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలకు విస్తరించారు. తెలంగాణలో 15 వేలమంది బాలికలకు ఈ సాయం అందించనున్నట్లు తెలిపారు.

Scholarship

దరఖాస్తు వివరాలు, చివరి తేదీ

ఇప్పటికే ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 3,276 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,200 మంది పూర్తి వివరాలు సమర్పించారని అధికారులు తెలిపారు. ఈ నెల 30 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు(Online applications) స్వీకరించనున్నారు. దరఖాస్తుకు ఎటువంటి ఫీజు ఉండదని స్పష్టం చేశారు.

స్కాలర్‌షిప్‌ను ప్రతి ఏడాది రెండు విడతల్లో రూ.30 వేల రూపాయలుగా అందించనున్నారు. అయితే, ఇప్పటికే ఇతర స్కాలర్‌షిప్లు పొందుతున్న విద్యార్థులు దీనికి అర్హులు కారని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో లాటరీ విధానాన్ని అనుసరించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల మంది బాలికలకు ఈ స్కాలర్‌షిప్ అందించాలనే లక్ష్యంతో ఫౌండేషన్ ముందుకు సాగుతోంది.

స్కాలర్‌షిప్ మొత్తం ఎంత?
ప్రతి విద్యార్థిని కి సంవత్సరానికి రూ.30,000 స్కాలర్‌షిప్ అందుతుంది.

ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ప్రభుత్వ స్కూల్‌లో 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.