రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2,570 ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.
Read Also: Microsoft CEO: ఏఐ తో భారీ ప్యాకేజీ అందుకున్న సత్య నాదెళ్ల

ముఖ్యమైన తేదీలు, అర్హతలు:
- పోస్టుల సంఖ్య: 2,570 (ఇంజినీరింగ్ విభాగాలు)
- దరఖాస్తు ప్రారంభం: ఈ నెల అక్టోబర్ 31 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది.
- దరఖాస్తు చివరి తేదీ: అభ్యర్థులు నవంబర్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా (Diploma) లేదా బీటెక్ (B.Tech/BE) పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు (SC/ST/OBC) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ వివరాలు:
అభ్యర్థుల ఎంపిక(RRB) కింది దశల ద్వారా జరుగుతుంది:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష-1 (CBT-1): ఇది స్క్రీనింగ్ టెస్ట్.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష-2 (CBT-2): షార్ట్లిస్ట్(Shortlist) అయిన అభ్యర్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ (CV): ధ్రువపత్రాల పరిశీలన.
- మెడికల్ టెస్ట్: ఆరోగ్య పరీక్షలు.
ఎంపికైన అభ్యర్థులను రైల్వేలోని వివిధ జోన్లలోని ఇంజినీరింగ్ విభాగాలలో నియమిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలు, ఆయా పోస్టుల విభాగాల వారీగా ఖాళీలు మరియు సిలబస్ కోసం RRB అధికారిక వెబ్సైట్ https://www.rrbapply.gov.in ను సందర్శించవచ్చు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: