ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్(PG Admissions) ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్డీ (పీబీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP PGECET)–2026 నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
Read Also:SSC Board: టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు
ఈ ఏడాది ఏపీ పీజీఈసెట్ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 6 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీఈసెట్కు(PG Admissions) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత కోర్సును బట్టి బీఈ, బీటెక్, బీఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఫుడ్ టెక్నాలజీ, జియో ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జికల్, నానో టెక్నాలజీ, ఫార్మసీ వంటి విభాగాల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 6, 2026
- ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు: ఫిబ్రవరి 6 – మార్చి 6
- ఆలస్య రుసుముతో దరఖాస్తులు: మార్చి 11 – 23 (రూ.1000 నుంచి రూ.10,000 వరకు)
- దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 24 – మే 25
- హాల్టికెట్ల విడుదల: ఏప్రిల్ 15 నుంచి
- ప్రవేశ పరీక్షలు: ఏప్రిల్ 28, 29, 30
- ప్రాథమిక కీ విడుదల: మే 6
- అభ్యంతరాల స్వీకరణ చివరి తేదీ: మే 8
- ఫలితాల విడుదల: మే 14, 2026
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: