దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న (NEET PG-2025) ఫేజ్-1 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు తమకు నచ్చిన MD, MS, PG డిప్లొమా కోర్సుల కోసం నవంబర్ 5 వరకు ఛాయిస్ ఫిల్లింగ్ చేయవచ్చు.
Read Also: TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు నేటి నుంచి స్వీకరణ
సీట్ల కేటాయింపు నవంబర్ 8
కౌన్సెలింగ్ ప్రక్రియలో మొదటి దశ సీట్ల కేటాయింపు నవంబర్ 8న జరగనుంది. ఆ తరువాత అభ్యర్థులు సీటు కేటాయింపు ఫలితాలను అధికారిక వెబ్సైట్ (Website) లో తనిఖీ చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు నిర్దిష్ట సమయానికి కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
MCC అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం నాలుగు రౌండ్ల కౌన్సెలింగ్ను 2026 జనవరి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారు.ఆల్ ఇండియా PG మెడికల్ సీట్లలో 50% కోటా ఈ కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. సీట్ల అప్రూవల్ పెండింగ్, సుప్రీంలో కేసులతో కౌన్సెలింగ్ ఆలస్యమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: