దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ఐఐటీలు సహా ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEEMain2026 తొలి విడత పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో JEE మెయిన్ 2026 (సెషన్–1) పరీక్షల తేదీలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరోసారి కీలక ప్రకటన చేసింది.
Read Also: Health Department:త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సరస్వతి పూజ కారణంగా పశ్చిమ బెంగాల్లో తేదీ మార్పు
ఇప్పటికే జనవరి 21 నుంచి 29 వరకు మొత్తం ఆరు రోజులపాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని NTA ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్లో జనవరి 23న సరస్వతి పూజకు అధికారిక సెలవు ఉండటంతో, అదే రోజున పరీక్ష ఉండడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పండుగ ఆ రాష్ట్ర ప్రజలకు మతపరంగా, భావోద్వేగపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉండటమే ఇందుకు కారణం.
విద్యార్థులు పూజా కార్యక్రమాలు పాటించాలా, లేక కీలకమైన పోటీ పరీక్ష రాయాలా అనే అయోమయంలో పడటంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు NTA దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జనవరి 23న పశ్చిమ బెంగాల్లో జరగాల్సిన JEEMain2026పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రోజు పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులకు మరో ప్రత్యామ్నాయ తేదీని కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, NTA ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్లను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అడ్మిట్ కార్డులు కూడా త్వరలో అధికారిక వెబ్సైట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా హాల్ టికెట్లు పరీక్షకు 3–4 రోజుల ముందు, అంటే జనవరి 17 నుంచి డౌన్లోడ్కు అందుబాటులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. పరీక్ష స్థాయి, ప్రశ్నపత్ర విధానం, నిబంధనలు అన్ని తేదీల్లో ఒకే విధంగా ఉంటాయని NTA స్పష్టం చేసింది. ఏ విద్యార్థికీ అన్యాయం జరగకుండా పరీక్ష తేదీ మాత్రమే మార్చామని, కొత్త తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: