దేశవ్యాప్తంగా పదో తరగతి (10th) మరియు ఇంటర్మీడియట్ (12th) విద్యార్థులకుపరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే హోలీ పండుగ కారణంగా మార్చి 15న జరగాల్సిన హిందీ పరీక్షకు హాజరుకాలేకపోతున్న విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)గురువారం ప్రకటించింది. ఈ మేరకు విద్యార్ధులు గమనించగలరని సీబీఎస్ఈ పరీక్ష కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ పరీక్షను షెడ్యూలు ప్రకారమే నిర్వహించాలని నిర్ణయించినా మార్చి 15న హోలీ కారణంగా పరీక్షలో పాల్గొనలేకపోయిన వారికి మరో తేదీన పరీక్ష రాసే అవకాశం ఇస్తాం అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో పాల్గొనే విద్యార్థులకు బోర్డు నియమ నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈసారి ఈ విద్యార్థులతో పాటు హోలి పండగ కి పరీక్ష రాయలేని విద్యార్థులకు కూడా పరీక్ష రాసేందుకు అవకాశం బోర్డు నిర్ణయించిందని ఆయన తెలిపారు.ఈసారి హోలీ పండగ కారణంగా పరీక్ష రాయలేని విద్యార్థులకు కూడా పరీక్ష రాసే అవకాశం ఇవ్వనున్నట్లు సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణ అధికారి సంయమ్ భరద్వాజ్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
పరీక్షకు హాజరు
హోలీ పండుగ మార్చి 14న (గురువారం) అయినప్పటికీ, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ పండుగ మార్చి 15న కూడా జరుపుకుంటారు. దీని ప్రభావంతో కొంతమంది విద్యార్థులు హిందీ పరీక్షకు హాజరుకాలేకపోవచ్చని (సీబీఎస్ఈ) అంచనా వేసింది. దీంతో, పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని బోర్డు నిర్ణయించింది.దేశ వ్యాప్తంగా(సీబీఎస్ఈ)10, 12 తరగతుల బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశ విదేశాల్లోని దాదాపు 8 వేల పాఠశాలల నుంచి దాదాపు 44 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల సమగ్రతను కాపాడటానికి (సీబీఎస్ఈ) కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రెగ్యులర్ విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫాంలు ధరించాలని, ప్రైవేట్ అభ్యర్థులు లేత రంగు దుస్తులను ఎంచుకోవాలని పేర్కొంది. అలాగే మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, కెమెరాలు, పర్సులు, హ్యాండ్బ్యాగులు, గాగుల్స్, పౌచ్లు వంటి వాటికి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదు.

పరీక్ష హాల్
మధుమేహం(డయాబెటిక్) ఉన్న విద్యార్థులు మాత్రమే ముందుగా అనుమతి పొందిన షుగర్ ఫుడ్ మరియు వాటర్ బాటిల్ ను పరీక్ష హాల్లోకి తీసుకెళ్లే వెసులుబాటు కల్పించారు.10వ తరగతి పరీక్షలు మార్చి 18న,12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి.