27న మిగిలిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్
జులై 5న సీట్ల కేటాయింపు..
జులై 7లోపుగా కాలేజీల్లో చేరాలి
డిఇఇసెట్ (DEECET) కన్వీనర్ జి రమేష్ హైదరాబాద్: రెండేళ్ల కోర్సు అయిన డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(DED), డిప్లమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్(DPSE) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన డిఈఈసెట్-2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడత కౌన్సెలింగ్లో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాని వారికి ఈ నెల 27న పూర్తి చేయనున్నట్టు డిఈఈ సెట్-2025 కన్వీనర్ జి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడతలో భాగంగా ఈ నెల 28 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. మొదటి విడతలో సీట్లు రాని వారు, మొదటి విడతలో సీటు పొందినప్పటికీ స్లయిడింగ్ పొందాలనుకునే వారు కూడా వెబ్ ఆప్షన్లను ఇవ్వాడానికి అవకాశంకల్పించినట్టు తెలిపారు.
జులై 7లోపుగా కాలేజీల్లో చేరాలి
జులై 1నవెబ్ ఆప్షన్లకు ఎడిట్ సౌకర్యం కల్పించారు. వెబ్ ఆప్షన్లను ఇచ్చిన వారికి జులై 5న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీటు పొందిన వారు ఫీజు చెల్లించి జులై 7లోపల కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని రమేష్ ప్రకటనలో పేర్కొన్నారు. డిఈఈ సెట్లో 26,442 మంది అర్హత సాధించగా వారిలో మొదటి విడత కౌన్సెలింగ్లో భాగంగా 19,909 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. వారిలో 19,169 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ డైట్ కాలేజీలు 10 ఉండగా.. ప్రైవేటు డైట్ కాలేజీలు 59 ఉనానయి. మొత్తం 69 కాలేజీల్లో 4350 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మేనేజ్మెంట్ కోటా సీట్లు 600 600 ఉన్నాయి. మిగిలిన 3750 సీట్లు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లుగా పరిగణించబడతాయి. 3750 కన్వీనర్ కోటా సీట్లలో మొదటి విడత కౌన్సెలింగ్లో 3462 మంది విద్యార్థులకి (92.32 శాతం) వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఈ నెల 20న సీట్ల కేటాయింపు చేశారు. వారు ఫీజు చెల్లించి ఈ నెల 25 అంతకు ముందు కాలేజీల్లో చేరాల్సి ఉంది.
Read also: Bhatti Vikramarka: సంక్షేమానికి రూ.95,351కోట్ల వ్యయం: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క