PG Entrance Exams: ఆగస్టు 4 నుంచి కామన్ పిజి ఎంట్రన్స్ పరీక్షలు

Read Time:  1 min
PG Entrance Exams: ఆగస్టు 4 నుంచి కామన్ పిజి ఎంట్రన్స్ పరీక్షలు
FONT SIZE
GET APP

హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పిజి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్ పిజి ఎంట్రన్స్ టెస్ట్ (TGCPGET)-2025 పరీక్షలను ఆగస్టు 4 నుంచి నిర్వహించ నున్నారు. ఇందుకు సంబంధించి సబ్జెక్టు వారీ పరీక్షల షెడ్యూల్ను త్వరలోనే వెల్లడించానున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను జూన్ 18 నుంచి స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు 36 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది.

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి టెస్టులు

పిజి కోర్సులైన ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ (MA, MSc, MCom), ఎంఈడి, ఎంపిఈడి వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి) ప్రోగ్రామ్లతో పాటు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి “సిపిజెట్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వ విద్యా లయం, కాకతీయ విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వ విద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జెఎన ‘యుహెచ్)లో ప్రవేశాల కోసం సిపిజెట్ను నిర్వ హించనున్నారు. జూన్ 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించగా.. ఈ నెల 17 వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను స్వీక రించనున్నారు. రూ. 500 అపరాధ రుసుంతో జులై 24 వరకు, రూ. 2000తో ఈ నెల 28 వరకు దరఖాస్తులను స్వీకరిం చనున్నారు. రాష్ట్రం లో 297 కాలేజీల్లో సుమారు 50వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 45 సబ్జెక్టులలో ప్రవేశాల కోసం కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామి నేషన్(సిబిటి) విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు .

Read: hindi.vaartha.com

Read also: Vivek Venkata swamy: సింగరేణి నిధులు ఇక్కడే ఖర్చు చేస్తాం- మంత్రి వివేక్ వెంకటస్వామి

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.