ఇంజినీరింగ్ ఫీజులకు సంబంధించి ఏపీ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తుది తీర్పుకు అనుగుణంగా ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు చేస్తూ ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం కనిష్ఠంగా రూ.40వేల నుంచి గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు ఫీజు ఉండనుంది. 7 కాలేజీలకు మాత్రమే స్వల్పంగా ఫీజులు పెరిగాయి. (AP) ఫీజురీయింబర్స్మెంట్ పథకం కింద అడ్మిషన్లు పొందిన వారికి 2024-25 నుంచి మూడేళ్ల కాలానికి ఇవే ఫీజులు అమలవుతాయి. కాగా గతంలో కనీస ఫీజు రూ.43వేలుగా ఉండేది.
Read Also: Nara Lokesh: పేదలకు మెడికల్ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సేవలు పీపీపీతో సాధ్యం

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: