దేశంలో వేగంగా ఎదుగుతున్న క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో (Zepto) వినియోగదారులను ఆకట్టుకునే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ఆర్డర్లలో పెరుగుతున్న పోటీ మధ్య, జెప్టో తన సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ముందడుగు వేసింది. ఇకపై జెప్టో (Zepto) వినియోగదారులు ఆర్డర్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ ఫీజులు, సర్జ్ ఛార్జీలు, రెయిన్ ఛార్జీలు వంటి అదనపు ఖర్చులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది…
Read Also: Arcelor Mittal: దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఉక్కు ప్రాజెక్ట్ నిప్పాన్ స్టీల్స్
ఇందులో భాగంగా, ₹99 కంటే ఎక్కువ విలువ గల అన్ని ఆర్డర్లను ఉచితంగా డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంటే వినియోగదారు రూ.99 కంటే ఎక్కువ విలువ ఉన్న ఆర్డర్ చేస్తే ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఉచిత డెలివరీ పొందగలరు. అయితే, రూ.99 కంటే తక్కువ విలువ గల ఆర్డర్లపై మాత్రం ₹30 డెలివరీ ఛార్జీ వసూలు చేయనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: