ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ (Iphone) మోడళ్లు మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత, కొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్తో ఆ మోడళ్లు యువతను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఈ క్రమంలో పాత మోడళ్లు ‘ఔట్డేటెడ్’గా మారిపోతున్నాయి. ఫలితంగా అప్పులు చేసి కొత్త ఫోన్ కొనాలనే మానసికత యువతలో పెరుగుతోంది. ఒక ఫోన్ కోసం లక్షల్లో ఖర్చు చేయడం వారి ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక రెండు సంవత్సరాలకే పాతబడిపోతున్న వస్తువుపై అంత డబ్బు పెట్టడం సమంజసం కాదని వారు సూచిస్తున్నారు.
అదే సమయంలో ఆ డబ్బును సరిగ్గా పెట్టుబడి పెడితే దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. ఉదాహరణకు, ఐఫోన్ కొనడానికి తీసుకునే EMIని మ్యూచువల్ ఫండ్స్లో SIP రూపంలో ప్రతి నెలా పెట్టుబడిగా మార్చుకుంటే, కొన్నేళ్లలో పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. అలాగే బంగారంలోనూ పెట్టుబడి పెడితే విలువ పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఫోన్ రెండు సంవత్సరాలకే విలువ కోల్పోతే, పెట్టుబడులు మాత్రం కాలక్రమంలో పెరిగి ఆర్థిక భద్రతను ఇస్తాయి.
నేటి యువత ఫ్యాషన్, స్టేటస్ సింబల్ కోసం ఖర్చు చేయడాన్ని ప్రాధాన్యత ఇస్తున్నా, ఆర్థిక అవగాహన పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక్క ఫోన్ కోసం అప్పుల బారం మోసే బదులు, అదే డబ్బుతో భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఇన్వెస్ట్ చేయడం తెలివైన నిర్ణయం అవుతుంది. అందుకే నిపుణులు “SIP చేస్తారా? లేక ఫోన్ కొంటారా?” అనే ప్రశ్నను మనముందు ఉంచుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు తాత్కాలిక ఆనందం కన్నా దీర్ఘకాలిక లాభం గురించే ఆలోచించడం మేలని చెబుతున్నారు.