📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

Warangal: రాష్ట్రంలో భారీగా యూరియా కొరత

Author Icon By Sharanya
Updated: August 4, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో వర్షాకాల వ్యవసాయానికి నాట్లు జరుగుతున్న సమయంలో, యూరియా కొరత (Urea deficiency) రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. వరంగల్ (Warangal) జిల్లాలో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Warangal

బుధరావుపేటలో రైతుల ఆందోళన

వరంగల్ (Warangal) జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట (Budharaopet) పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా అందకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చున్నా, ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా యూరియా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూరియా కోసం రాస్తారోకో

రాష్ట్రంలో చాలాచోట్ల యూరియా అందక రైతులు రాస్తారోకోలకు దిగుతున్నారు. విత్తనాలు వేసిన తర్వాత సమయానికి ఎరువులు అందకపోవడం వల్ల పంట నష్టానికి గురవుతుందన్న ఆందోళన రైతుల్లో ఉంది. అధికారులు సమర్థవంతంగా ప్రణాళికలు వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

“నాట్లు వేయమన్నారు..ఎరువులు మాత్రం లేవు”

“సాగునీరు, ఎరువులు సమయానికి అందుతాయంటూ మమ్మల్ని నాట్లు వేయమన్నారు. ఇప్పుడు ఎరువుల కోసం రోడ్డుపై పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా వ్యవసాయం ఎలా సాగించాలి?” అంటూ రైతులు వాపోతున్నారు. యూరియా సరైన సమయానికి అందించడం చేతకానప్పుడు నాట్లు ముందుగా వెయ్యమని ఎందుకు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.

ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/komatireddy-accuses-kcr-harish-of-massive-corruption/telangana/525907/

Breaking News FarmersProtest FertilizerCrisis latest news PACSCenters RythuProblems TelanganaAgriculture Telugu News UreaShortage warangal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.