ప్రముఖ వ్యాపారవేత్త మరియు భారతదేశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా (Vijay Mallya) ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూ నాలుగు గంటల 15 నిమిషాల పాటు సాగి, విడుదలైన నాలుగు రోజుల్లోనే 2 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. దీనిపై మాల్యా స్పందిస్తూ, “నా మాటలు వింటున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి” అని మాల్యా ‘ఎక్స్’ లో ఓ పోస్టు పెట్టారు.

ఐపీఎల్, RCB, వ్యాపార ఇమేజ్
ఈ ఇంటర్వ్యూలో మాల్యా తన జీవితంలోని ఎన్నో అంశాలపై తెరమీద మాట్లాడారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్న మాల్యా, 2025 ఐపీఎల్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ యజమాని. రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలతో 2016లో ఆయన భారత్ విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆరోపణలన్నింటినీ మాల్యా ఖండించారు.
చట్టపరంగా న్యాయం కోసం పోరాటం
విజయ్ మాల్యా తన భవిష్యత్ ఆశలను కూడా షేర్ చేశారు. న్యాయ వ్యవస్థపై నాకు విశ్వాసం ఉంది. తాను చెల్లించాల్సిన రూ. 6,200 కోట్ల అప్పు ఇప్పటికే రికవరీ అయిందని ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టుకు సమర్పించిన నివేదికలో మాల్యా పేర్కొన్నారు. తన నుండి, యునైటెడ్ బ్రూవరీస్ నుండి, ఇతర సర్టిఫికేట్ రుణగ్రహీతల నుండి రికవరీ అయిన మొత్తాలపై వివరణాత్మక ఖాతా స్టేట్మెంట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.