हिन्दी | Epaper
జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే ల పై కేంద్రమంత్రి విమర్శలు.

Anusha
రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే ల పై కేంద్రమంత్రి విమర్శలు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే హిందువుల మనోభావాలను అవమానపరిచారని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే తీవ్ర విమర్శలు చేశారు. మహా కుంభమేళా వంటి పవిత్రమైన కార్యక్రమానికి హాజరుకాకపోవడం హిందువుల సెంటిమెంట్లను గాయపరిచేలా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించని నేతలను ప్రజలు బహిష్కరించాలని సూచించారు.ఈ సందర్భంగా రాందాస్ అథవాలే మీడియాతో మాట్లాడుతూ, “కుంభమేళా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన హిందూ కార్యక్రమం. ఏకంగా యూనెస్కో వంశపారంపర్య కీర్తి జాబితాలోనూ ఉంది. ఇంతటి గొప్ప వేడుకకు హిందుత్వాన్ని ప్రచారం చేసుకునే ఉద్ధవ్ ఠాక్రే రావడం లేదు. అలాగే, రాహుల్ గాంధీ తనను హిందూ అని చెప్పుకుంటూనే కుంభమేళాకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇది నిజమైన హిందువులకు అవమానం,” అని విమర్శించారు.

668542944ab3c congress leader rahul gandhi with uddhav thackeray left in mumbai file photo pti 032242717 16x9

రాందాస్ అథవాలే విమర్శ

థాక్రే కుటుంబం, గాంధీ కుటుంబం ఎప్పుడూ హిందూ మతాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ, మౌలికంగా హిందువుల మనోభావాలను పట్టించుకోరని ఆయన ఆరోపించారు. రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు, హిందువుల ఓట్లు అడిగే సమయంలో వారిని ఆదరించాలనే మనస్తత్వం చూపిస్తూ, మరి వారి సాంప్రదాయ ఉత్సవాలకు ఎందుకు దూరంగా ఉంటారని ప్రశ్నించారు.”రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేస్తూ హిందువుల్ని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అదే సమయంలో హిందువుల పవిత్ర మేళాలకు మాత్రం దూరంగా ఉంటారు. హిందూ ఓటర్లకు ఇదేనా గౌరవం? హిందూ మత విశ్వాసాలను కేవలం ఓట్ల కోసమే వినియోగించుకోవడం సరికాదు,” అని అథవాలే మండిపడ్డారు.

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయంగా పూర్తిగా మారిపోయారని, తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వం కోసం పోరాడారని కానీ ఉద్ధవ్ మాత్రం రాజకీయ లాభాల కోసమే హిందుత్వాన్ని వదిలేశారని ఆయన విమర్శించారు. శివసేన యూటీబీ కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిలో చేరి హిందుత్వ భావజాలాన్ని పక్కనపెట్టిందని ఆరోపించారు.ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఉద్ధవ్ ఠాక్రేకు తగిన గుణపాఠం చెప్పారని, ప్రజలు మళ్లీ అలాంటి నేతలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. “రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిజమైన హిందుత్వాన్ని గౌరవించే నాయకులను ఎన్నుకోవాలి. మహా కుంభమేళా వంటి పవిత్రమైన వేడుకలను పక్కన పెట్టే నాయకులకు భవిష్యత్తు లేదు” అని హిందూ సమాజానికి మహా కుంభమేళా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఇలాంటి పవిత్రమైన వేడుకను పరిగణనలోకి తీసుకోకుండా, హాజరుకాకుండా ఉండటం ఒక నాయకుడిగా బాధ్యతారాహిత్యంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870