TRAI Telecom Report 2026: భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసిన 2026 జనవరి నివేదిక ప్రకారం, దేశీయ టెలికాం రంగంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్ ఈ ఏడాదిని అత్యంత ఆశాజనకంగా ప్రారంభించింది. కేవలం జనవరి నెలలోనే 44 లక్షల మంది కొత్త మొబైల్ వినియోగదారులను తన ఖాతాలో చేర్చుకుంది. దీనితో ఎయిర్టెల్ మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 467.7 మిలియన్లకు చేరుకుంది.
Read Also: UIDAI: వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
జియో ఆధిపత్యం.. వీఐకి తప్పని కష్టాలు
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. జనవరిలో 2.4 మిలియన్ల కొత్త కస్టమర్లను ఆకర్షించడం ద్వారా జియో మొత్తం యూజర్ల సంఖ్య 491.4 మిలియన్లకు చేరింది. తక్కువ ధరల డేటా ప్లాన్లు జియోకు ప్రధాన బలంగా నిలిచాయి. మరోవైపు, వోడాఫోన్ ఐడియా (Vi) పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. జనవరిలో సుమారు 4.11 లక్షల మంది వినియోగదారులను కోల్పోవడంతో, ఆ సంస్థ యూజర్ల సంఖ్య 19.9 కోట్లకు పడిపోయింది.
TRAI Telecom Report 2026: బ్రాడ్బ్యాండ్ రంగంలోనూ పోటీ
మొబైల్ నెట్వర్క్తో పాటు బ్రాడ్బ్యాండ్ రంగం కూడా భారత్లో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 1.05 బిలియన్లకు చేరింది. ఇందులో జియో 49 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్టెల్ 34 శాతం వాటాతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మరియు వీఐ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: