📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్

Basara Triple IT Campus : నేడు బాసర ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల జాబితా విడుదలకు సిద్దం

Author Icon By Divya Vani M
Updated: July 4, 2025 • 7:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో (Basara Triple IT Campus) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల జాబితా శుక్రవారం విడుదల కానుంది. ఈ జాబితాను యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ (Chancellor Professor Goverdhan) అధికారికంగా రిలీజ్ చేయనున్నారు.ఈసారి ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు విద్యార్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 20,258 మంది విద్యార్థులు అప్లై చేశారు. ఇది గతేడాది కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ డిమాండ్‌ ట్రిపుల్‌ఐటీ పట్ల విద్యార్థుల్లో ఉన్న ఆకర్షణ స్పష్టంగా తెలుస్తోంది.ప్రస్తుతం బాసర క్యాంపస్‌లో 1,500 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది మొదటిసారిగా మహబూబ్‌నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపస్‌ ద్వారా 180 సీట్లు కలిపి మొత్తం 1,680 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ రెండింటి కలిపిన కోటాతో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

Basara Triple : నేడు బాసర ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల జాబితా విడుదలకు సిద్దం

పదో తరగతి మార్కులకే ప్రధాన ప్రాధాన్యం

విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. మెరిట్‌ ప్రాతిపదికన ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా జాబితా రూపొందించబడింది. దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్‌గా మారింది.

వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ చూడండి

ఎంపికైన అభ్యర్థుల జాబితా సహా ఇతర సమాచారం కోసం అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ www.rgukt.ac.in ను సందర్శించవచ్చు. పూర్తి వివరాలు అక్కడ పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.

Read Also : Liquor Dump Case : కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరో షాక్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.