📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Terror Attack : ఉగ్రదాడి.. విశాఖ వాసి గల్లంతు?

Author Icon By Sudheer
Updated: April 23, 2025 • 9:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ బైసరీన్ వ్యాలీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. విశాఖపట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల కశ్మీర్‌కు టూర్కు వెళ్లారు. దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల్లో ఆందోళన

దాడి జరిగిన అనంతరం చంద్రమౌళితో బంధువులు ఫోన్‌లో ట్రై చేసినా, ఆయనుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనితో, ఆయన భార్య పోలీసులను ఆశ్రయించి, తన భర్త ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రమౌళి ఆచూకీ కోసం గాలింపు

ప్రస్తుతం పోలీసులు చంద్రమౌళి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. కశ్మీర్‌లో భద్రతా పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి క్లిష్టంగా మారడంతో, అక్కడికి వెళ్లిన పర్యాటకుల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు ఆయన సురక్షితంగా తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు.

Google News in Telugu Jammu and Kashmir Pahalgam Terror Attack Visakhapatnam resident missing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.