Stock markets: కాల్పుల విరమణతో భారీగా లాభాలు అందుకున్న స్టాక్ మార్కెట్లు

Read Time:  1 min
Stock markets: కాల్పుల విరమణతో భారీగా లాభాలు అందుకున్న స్టాక్ మార్కెట్లు
FONT SIZE
GET APP

భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే విపరీతంగా లాభాల బాట పట్టాయి. నాలుగు రోజులపాటు సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర కాల్పులు, ఉగ్రదాడుల తర్వాత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం, పెట్టుబడిదారులలో కొత్త నమ్మకాన్ని కలిగించింది.

Stock markets
Stock markets

ఈ పరిణామం దలాల్ స్ట్రీట్‌ (Dalal Street) లో సానుకూల సెంటిమెంట్‌ను కొనుగోళ్ల పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 10:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) ఏకంగా 2254.45 పాయింట్లు పెరిగి 81,708.92 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 694.65 పాయింట్ల లాభంతో 24,702.65 వద్ద ట్రేడ్ అయింది. ఈ భారీ ర్యాలీతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో కొనసాగిన తీవ్ర కాల్పుల అనంతరం కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం పాకిస్థాన్ ప్రధాన స్టాక్ సూచీపై కూడా సానుకూల ప్రభావం చూపింది. అక్కడి మార్కెట్ సోమవారం ప్రారంభంలోనే 9 శాతానికి పైగా లాభపడింది.

కీలక రంగాల్లో భారీ లాభాలు

బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ, పోర్ట్స్ రంగాల్లోని దిగ్గజ సంస్థల షేర్లు భారీగా లాభపడినవి. అదానీ గ్రూప్ సంస్థల షేర్లు 5% వరకు పెరగగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కీలక కంపెనీలు 3–4% మధ్య లాభాలతో ట్రేడ్ అయ్యాయి. వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బాతిని ఈ ప్రస్తుత ర్యాలీకి పలు సానుకూల పరిణామాలు దోహదపడ్డాయని తెలిపారు. “భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం అనే అత్యంత సానుకూల వార్త భారత మార్కెట్లకు ఊతమిచ్చింది” అని ఆయన అన్నారు.

మార్కెట్ వోలటిలిటీ – నిపుణుల అభిప్రాయం:

వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బాతిని మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. అమెరికా(America), చైనా(China) మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు బాగా పురోగమిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి అని బాతిని వివరించారు. మార్కెట్‌లో అస్థిరత కూడా గణనీయంగా తగ్గిందని, విక్స్ సూచీ ప్రస్తుతం నియంత్రణలో ఉంటూ 20 కంటే తక్కువగా ట్రేడ్ అవుతోందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు కూడా ఎలాంటి ప్రతికూలతను ఇవ్వకపోవడం మార్కెట్ జోరును కొనసాగించడానికి సహాయపడిందని ఆయన తెలిపారు. ఈ సూచికలన్నీ భారత మార్కెట్లకు సానుకూల ఊపునిచ్చాయి, లాభాలు నిలకడగా కొనసాగుతున్నాయి అని బాతిని పేర్కొన్నారు.

Read also: Airtel: ఎయిర్‌టెల్ సంచలన నిర్ణయం.. 17 వేల కోట్ల డీల్..

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.