ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరియు అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశీయ మార్కెట్ల (Stock Market) పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్లకే కాకుండా భారత స్టాక్ మార్కెట్(Stock Market)ను కూడా భారీ నష్టాల్లోకి నెట్టేశాయి. భారత స్టాక్ మార్కెట్లు (Stock Market) నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రెండు కీలక సంఘటనలు దేశీయ మార్కెట్లపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు.
ఇన్వెస్టర్లలో ఆందోళన..
ఉదయం 9:16 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 1,121 పాయింట్లు కోల్పోయి 80,570.63 వద్దకు పడిపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 (Nifty) 334 పాయింట్లు నష్టపోయి 24,553.55 వద్ద ట్రేడ్ అయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 12% పెరిగి బ్యారెల్కు 78 డాలర్లు చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తే, చమురు సరఫరా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభానికి దారితీయవచ్చు. మార్కెట్లో అస్థిరత తీవ్రంగా పెరిగింది. బ్రాడర్ మార్కెట్ సూచీలు కూడా గురువారం నాటి నష్టాలను కొనసాగిస్తూ భారీగా పతనమయ్యాయి.
ఇజ్రాయెల్ దాడులు – ఇరాన్ ప్రతీకారం భావన
ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ఆ దేశ అణు మౌలిక సదుపాయాలపై ముందస్తు దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. ఈ సైనిక చర్య నుంచి అమెరికా దూరంగా ఉన్నప్పటికీ, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు వేగంగా పెరిగాయి. ఇది ఆర్థిక మార్కెట్లలో తీవ్ర ఆందోళన కలిగించింది. బ్రెంట్ ముడిచమురు ధరలు ఏకంగా 12 శాతం పెరిగి బ్యారెల్ దాదాపు 78 డాలర్లకు చేరుకున్నాయి. ఇరాన్ ప్రతీకారంగా హార్ముజ్ జలసంధిని మూసివేస్తే చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. చమురు ధరల పెరుగుదల కారణంగా విమానయానం, పెయింట్స్, టైర్లు, మండే పదార్థాల రంగాలు ఒత్తిడిలోకి వస్తాయి. అయితే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి చమురు ఉత్పత్తి సంస్థలు ఈ ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో ఉన్నాయి. మార్కెట్లు ప్రస్తుతం రిస్క్ తీసుకోవడానికి వెనుకాడే ధోరణిలో ఉంటాయి.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
దేశీయంగా గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మార్కెట్ సెంటిమెంట్ను మరింత దెబ్బతీసింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం (ఫ్లైట్ ఏఐ171) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని దాదాపు 242 మంది మరణించారు. గత దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే ఇది అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా రికార్డులకెక్కింది. అత్యంత సురక్షితమైన వైడ్బాడీ విమానాల్లో ఒకటిగా పేరుపొందిన డ్రీమ్లైనర్కు ఇదే మొదటి ఘోర ప్రమాదం.
బోయింగ్ కంపెనీపై ప్రభావం
ఈ వార్తల నేపథ్యంలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, స్పైస్జెట్, అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్లో నష్టపోయాయి. గురువారం అమెరికా (US) ట్రేడింగ్లో బోయింగ్ షేర్లు 5 శాతం పడిపోయాయి. కొత్త సీఈవో కెల్లీ ఓర్త్బర్గ్ ఆధ్వర్యంలో ఉత్పత్తిలో ఇటీవలి పురోగతిని పారిస్ ఎయిర్ షోలో ప్రదర్శించాలని భావిస్తున్న బోయింగ్పై ఈ ప్రమాదం తీవ్ర ప్రభావం చూపింది. ప్రమాదంపై సమాచారం సేకరిస్తున్నామని, అయితే ప్రమాద కారణాలపై ఎలాంటి వివరాలు వెల్లడించలేమని బోయింగ్ తెలిపింది. ఈ ప్రమాదం డ్రీమ్లైనర్ మోడల్పై నమ్మకాన్ని దెబ్బతీసింది. అమెరికా మార్కెట్లో బోయింగ్ షేర్లు 5 శాతం తగ్గాయి. కొత్త CEO కెల్లీ ఓర్త్బర్గ్కు ఇది సవాలుగా మారింది. పారిస్ ఎయిర్ షోలో ప్రదర్శించాల్సిన ప్రోగ్రెస్పై కూడా ఈ ప్రమాదం నీడ వేసే అవకాశం ఉంది.
Read Also: Indian Companies: భారత కంపెనీల ప్రతినిధులు చైనాకు