📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: Stock Markets: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Author Icon By Rajitha
Updated: December 4, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ ఇచ్చాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐటీ రంగంలోని షేర్లలో కొనుగోళ్ల మద్దతు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం మార్కెట్లలో రికవరీకి సహాయపడింది. అయితే శుక్రవారం వెలువడే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయంపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటంతో లాభాలు పరిమితంగా ఉన్నాయి.

Read also: Harsha Goenka: అవసరమైన వస్తువులను మాత్రమే కొనండి: హర్ష గోయెంకా

Stock markets ended with gain

నిఫ్టీ మీడియా సూచీ 1.45 శాతం నష్టo

ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్ 158.5 పాయింట్లు పెరిగి 85,265.32 వద్ద స్థిరమైంది. నిఫ్టీ 47.75 పాయింట్లు లాభపడుతూ 26,033 వద్ద ముగిసింది. సెక్టార్ల వారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ సూచీ అత్యధికంగా 1.4 శాతం లాభపడింది. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లు కూడా బలంగా నిలిచాయి. నిఫ్టీ మీడియా సూచీ 1.45 శాతం నష్టపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ & గ్యాస్ రంగాల్లో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలలో స్వల్ప నష్టాలు కనిపించాయి.

సెన్సెక్స్‌లో టీసీఎస్, భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 28 పైసలు బలపడి 89.91 వద్ద ట్రేడ్ అయింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Forex IT shares latest news Nifty sensex stock market Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.