📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Author Icon By Shobha Rani
Updated: June 19, 2025 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9.19 సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 200 పాయింట్లు పతనమై 81,244 వద్ద, నిఫ్టీ (Nifty) 57 పాయింట్లు తగ్గి 24,754 వద్ద ట్రేడవుతున్నాయి. సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా, మెట్రోపోలీస్‌ హెల్త్‌కేర్‌, ఏషియన్‌ ఇండియా గ్లాస్‌, స్టెర్లైట్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌, వరుణ్‌ బేవరేజస్‌, ఆస్ట్రాజెనికా ఫార్మా, ఫ్యూజన్‌ ఫైనాన్స్‌ నష్టాల్లో మొదలయ్యాయి. రియాల్టీ, ఎనర్జీ, పీఎస్‌యూ రంగాల సూచీలు పుంజుకోగా.. మెటల్‌, ఆటో, పవర్‌, టెలికం సూచీలు కుంగాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో
ఆసియా పసిఫిక్‌ మార్కెట్లలోని ప్రధాన సూచీలు మొత్తం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. షాంఘై 0.86, జపాన్‌ నిక్కీ 0.71, హాంకాంగ్‌ హెచ్‌ఎస్‌ఐ 1.85, దక్షిణ కొరియా కోస్పీ0.26, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.03 శాతం నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడి 86.53 వద్ద మొదలైంది. నిన్న సాయంత్రం రూ.86.48 వద్ద ముగిసింది.
ఫెడ్‌ రిజర్వ్‌ కీలక నిర్ణయం
అమెరికా (America)కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌.. అంచనాలకు తగ్గట్లుగానే కీలక రేట్లను వరుసగా నాలుగో సమీక్షలోనూ యధాతథంగా కొనసాగించింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో, కీలక వడ్డీ రేటును మార్పు లేకుండా 4.25-4.5 శాతం వద్దే ఉంచింది. దీర్ఘకాలంలో గరిష్ఠ ఉపాధి సాధించేందుకు, ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లోపునకు తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం ఫెడ్‌ వెల్లడించింది.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

SEBI తాజా నిర్ణయం
ప్రభుత్వానికి 90%, అంతకుమించి వాటా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) షేర్లను స్టాక్‌ఎక్స్ఛేంజీల నుంచి స్వచ్ఛందంగా డీలిస్టింగ్‌ చేసుకునేందుకు ప్రత్యేక చర్యలను సెబీ (Sebi) చేపట్టింది. డీలిస్టింగ్‌ ప్రక్రియకు మూడింట రెండొంతుల మంది ప్రజా వాటాదార్లు ఆమోదం తెలపాలనే నిబంధన నుంచి వీటికి సడలింపును ఇచ్చింది.

Read Also: Satellite internet: మొబైల్ కనెక్టివిటీ లేని ప్రాంతాలకు శాటిలైట్

Breaking News in Telugu Google news Google News in Telugu IndianMarkets Latest News in Telugu Nifty Paper Telugu News sensex started with losses Stock markets StockMarket Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.