దేశీయ మార్కెట్లు (Stock Market) శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, ట్రంప్ నిర్ణయాలపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటిస్తున్నాయి. దీంతో సూచీలు (Stock Market) స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. సెన్సెక్స్ (Sensex) దాదాపు 200 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ (Nifty) 24,800 మార్క్ దాటింది. అటు గత కొన్ని రోజులుగా పెరుగుతోన్న ముడిచమురు ధరలు నేడు కాస్త దిగొచ్చాయి.
చమురు ధరలు తగ్గుదల
ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 187.73 పాయింట్లు పెరిగి 81,549.60 వద్ద, నిఫ్టీ (Nifty) 48.65 పాయింట్ల లాభంతో 24,841.90 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 86.58గా ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ టాటా మోటార్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు రాణిస్తున్నాయి. హీరో మోటార్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
ఆసియా-పసిఫిక్ మార్కెట్ల పరిస్థతి
ఆసియా-పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.14శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 సూచీ 0.61శాతం నష్టాల్లో ఉండగా.. హాంకాంగ్ హాంగ్సెంగ్ 0.56శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.65శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. జూన్ టీన్త్ సెలవు కారణంగా గురువారం అమెరికా మార్కెట్లకు సెలవు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురు ధర శుక్రవారం 2 శాతం తగ్గి 77.22 డాలర్లుగా ఉంది.
Read Also: Kalanithi Maran: కళానిధి మారన్కు లీగల్ నోటీసులు