దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్, ఆటో స్టాక్స్ రాణించడం సూచీలకు కొంతమేర కలిసొచ్చింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ఈ రాత్రికి వెలువనుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.
రూపాయి మారకం విలువ & బంగారం ధర
సెన్సెక్స్ (Sensex) ఉదయం 81,314.62 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,583.30) నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత లాభాల్లోకి వచ్చినప్పటికీ ఎంతోసేపు నిలవలేదు. ఇంట్రాడేలో 81,237.01- 81,858.97 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ.. చివరికి సెన్సెక్స్ (Sensex) 138 పాయింట్ల నష్టంతో 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty)
సైతం 41 పాయింట్లు కోల్పోయి 24,812.05 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.48గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3397 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికా ఫెడ్ నిర్ణయం పై ఎదురుచూపులు..
ఈ రాత్రి (భారత కాలమానం ప్రకారం) అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం వెలువడనుంది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల విషయంలో స్పష్టత కోసం మదుపర్లు వేచి చూస్తున్నారు. ఫలితంగా కమోదిటీ మార్కెట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్లో తక్కువ ట్రేడింగ్ కనిపించింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వడ్డీ రేట్లు, రూపాయి బలహీనత వంటి అంశాలు దగ్గరుగా గమనించాల్సిన అంశాలు. ఇన్వెస్టర్లు తక్కువ మౌలికత కలిగిన స్టాక్స్కు దూరంగా ఉండడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Read Also: India’s Wealth: వన్ వెల్త్ నివేదికలో అగ్రస్థానంలో అంబానీ