దేశీయ మార్కెట్ (Stock market) సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు నెలకొనడంతో.. మన సూచీలు స్తబ్దుగా కదలాడుతున్నాయి. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 87 పాయింట్ల లాభంతో 83,790 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 20 పాయింట్ల లాభంతో 25,562 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో మొదలయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లలో (Stock market) మిశ్రమ సంకేతాలు నెలకొనడంతో దేశీయ మార్కెట్లు స్తబ్దుగా కదలాడుతున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా స్పష్టత లేని ట్రెండ్తో ట్రేడవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹85.62గా ఉంది, ఇది సాంకేతికంగా కీలక మద్దతు స్థాయి వద్ద కొనసాగుతుంది.
Read Also: US: మోదీకి ట్రంప్ బిగ్ షాక్: భారత్పై 500% టారిఫ్ హెచ్చరిక