దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఆటో రంగాల షేర్లలో కనిపించిన అమ్మకాల ఒత్తిడి కారణంగా కీలక సూచీలు కిందకు జారాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 367 పాయింట్లు కోల్పోయి 85,041.45 వద్ద స్థిరపడగా, నిఫ్టీ (Nifty) 99.80 పాయింట్లు తగ్గి 26,042.30 వద్ద ముగిసింది. మార్కెట్లో బలమైన సానుకూల సంకేతాలు లేకపోవడం వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Read also: New Airlines: ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్లైన్స్?
Stock Market
హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాలను
ఈ వారం సెలవుల కారణంగా ట్రేడింగ్ సెషన్లు తక్కువగా ఉండటం, అలాగే సెన్సెక్స్ డెరివేటివ్స్ గడువు ముగియడం మార్కెట్ సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపింది. బీఎస్ఈలో టైటన్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు లాభాల్లో నిలవగా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఎన్ఎస్ఈలోనూ ఇదే తరహా ట్రెండ్ కొనసాగింది.
విశాల మార్కెట్లో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 0.23 శాతం, స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 0.08 శాతం మేర తగ్గాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, ఆటో సూచీలు పడిపోయినా, మెటల్ రంగంలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. దీనితో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.59 శాతం లాభపడటం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: