Stock Market: భారీ లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్ను ముగించాయి. హెవీవెయిట్ షేర్లలో స్థిరమైన కొనుగోళ్లు, బలమైన రూపాయి విలువ మార్కెట్ సూచీల పెరుగుదలకు దోహదపడింది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండటం వల్ల రోజంతా మార్కెట్లు ఉల్లాసంగా కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసినప్పుడు, బీఎస్ఈ సెన్సెక్స్ 447.55 పాయింట్ల లాభంతో 84,929 వద్ద నిలిచింది, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 25,966 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 85,067.50 స్థాయిని, నిఫ్టీ 25,993 స్థాయిని టచ్ చేసింది.
Read also: Best Mileage Bikes: 75 కి.మీ. మైలేజ్ ఇచ్చే అత్యుత్తమ బైకులు

The stock markets closed with gains
ముఖ్యమైన స్టాక్స్లో భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఏషియన్ పెయింట్స్, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు కూడా మంచి పనితీరం చూపాయి. అయితే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా, (kotak mahindra) బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 1.3% పెరిగాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 89.25 వద్ద స్థిరపడటం కూడా మార్కెట్లకు అదనపు బలం ఇచ్చింది. నిపుణుల అంచనా ప్రకారం, రికవరీ కొనసాగితే వచ్చే వారం ‘శాంటా ర్యాలీ’కి అవకాశం ఉంది. నిఫ్టీ 26,200 స్థాయికి చేరవచ్చు.
ముఖ్యాంశాలు:
- బీఎస్ఈ సెన్సెక్స్: 84,929 (447.55 పాయింట్ల లాభం)
- నిఫ్టీ: 25,966 (151 పాయింట్లు లాభం)
- టాప్ గెయినర్స్: భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్
- నష్టపోయిన షేర్లు: హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్
- మిడ్ & స్మాల్ క్యాప్ సూచీలు: 1.3% పెరుగుదల
- రూపాయి విలువ: 89.25 (డాలర్తో పోలిస్తే)
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: