దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ట్రేడింగ్లో ఐటీ, రియల్టీ, ఫార్మా, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్ (sensex) 345.91 పాయింట్లతో క్షీణించి 84,695.54 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 100.20 పాయింట్ల నష్టంతో 25,942.10 వద్ద ముగిసింది.
Read also: VIVO: మార్కెట్లోకి వివో వి35 స్లిమ్ అల్ట్రా 5జీ
Stock Market
నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్&ఓ) గడువు దగ్గరపడటంతో మార్కెట్లో ఒడుదొడుకులు పెరిగాయని నిపుణులు పేర్కొన్నారు. నిఫ్టీ కీలక 26,000 స్థాయిని దిగువకు దాటడం ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. టెక్నికల్ విశ్లేషణ ప్రకారం, అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది. నిఫ్టీ 25,900 స్థాయిని నిలబెట్టుకోలేకపోతే, 25,800–25,700 స్థాయిలకు పడే అవకాశం ఉందని సూచించారు.
సెన్సెక్స్లో పవర్గ్రిడ్, ట్రెంట్, హెచ్సీఎల్ టెక్, బీఎల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అయితే, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లలో కొంత కొనుగోలు మద్దతు కనిపించింది. బ్రాడర్ మార్కెట్లోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. నిఫ్టీ మిడ్క్యాప్ 100 0.52 శాతం, స్మాల్క్యాప్ 100 0.72 శాతం పడిపోయాయి. రంగాలవారీగా ఐటీ, రియల్టీ, ఆటో సూచీలు పతనం కాగా, మీడియా, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ సూచీలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: