Stock Market: తాజా రికార్డులతో మార్కెట్లు – రంగాల వారీగా మిశ్రమ పనితీరు

Read Time:  1 min
Stock Market
Stock Market
FONT SIZE
GET APP

దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Stock Market) గురువారం కొత్త రికార్డులు నమోదు చేశాయి. ట్రేడింగ్ మధ్యలో సెన్సెక్స్(Sensex), నిఫ్టీ ఇంతకుముందెన్నడూ లేని గరిష్ఠాలను తాకినా, రోజు ముగిసే సరికి సూచీలు స్వల్ప లాభాలతో స్థిరంగా క్లోజ్ అయ్యాయి.

క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్ 110.87 పాయింట్లు పెరిగి 85,720.38 వద్ద నిలిచింది. నిఫ్టీ 10.25 పాయింట్ల లాభంతో 26,215.55 వద్ద ముగిసింది. రోజు అంతటా సెన్సెక్స్ 86,055.86, నిఫ్టీ 26,310.45 వద్ద ఆల్‌టైమ్ హైలను నమోదు చేసి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి.

Read Also: Stock Markets: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Markets set fresh records mixed performance by sector

టెక్నికల్ పరంగా నిఫ్టీకి 26,300 కీలక రిజిస్టెన్స్‌గా మారిందని, దీన్ని బ్రేక్ చేస్తే 26,350–26,450 జోన్లలోకి చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే 26,150–26,000 మధ్య బలమైన సపోర్ట్ ఉన్నట్లు చెప్పారు.

బ్రాడర్ మార్కెట్లలో మిశ్రమ పనితీరు కనిపించింది.

  1. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.08% లాభపడగా,
  2. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.53% పడిపోయింది.

రంగాల వారీగా చూసినప్పుడు బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఐటీ, FMCG సెగ్మెంట్లలో కొనుగోళ్లకు డిమాండ్ ఉండగా, ఆటో, మెటల్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సిఎల్ టెక్ ప్రధాన గెయినర్లుగా నిలిచాయి.

రేపు వెలువడనున్న జీడీపీ డాటా, భారత్–అమెరికా ఒప్పందానికి సంబంధించిన పరిణామాలు, రాబోయే RBI పాలసీ మీటింగ్ వంటి అంశాలు మార్కెట్ మూడ్‌పై ప్రభావం చూపనున్నాయి. ఈ అంశాలే షార్ట్‌టర్మ్ మార్కెట్ దారిని నిర్ణయించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.