📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Stock market: సెన్సెక్స్‌ 645, నిఫ్టీ 203 పాయింట్లు డౌన్

Author Icon By Shobha Rani
Updated: May 22, 2025 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుస నష్టాల తర్వాత నిన్న లాభాలు చవిచూసిన సూచీలు.. నేడు మరోసారి నష్టాల బాటపట్టాయి. రిలయన్స్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ దాదాపు 1100 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 24,500 పాయింట్ల దిగువకు చేరింది. ట్రేడింగ్ చివర్లో కొన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు సూచీలను కొంత మేర కోలుకున్నట్టు చేసింది.అయితే ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ మాత్రమే పాజిటివ్ ముగిసిన షేర్లుగా నిలిచాయి. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. దిగుమతి ఆధారిత కంపెనీలపై ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Stock market: సెన్సెక్స్‌ 645, నిఫ్టీ 203 పాయింట్లు డౌన్

సెన్సెక్స్‌ ఉదయం 81,323.05 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లో కదలాడిన సూచీ ఇంట్రాడేలో 80,489.92 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 644.64 పాయింట్ల నష్టంతో 80,951.99 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 203.75 పాయింట్ల నష్టంతో 24,609.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 42 పైసలు క్షీణించి 86.01గా ఉంది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీసీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 63.99 డాలర్ల వద్ద ట్రేడవగా, బంగారం ఔన్సు 3305 డాలర్ల వద్ద కొనసాగింది. కానీ, మూలధన మద్దతు ఉన్న రంగాల్లో నెమ్మదిగా రికవరీ ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలు కీలకం.

Read Also: Tesla CFO: టెస్లా బంపర్ ఆఫర్.. ఢిల్లీ కుర్రాడికి వెయ్యి కోట్ల జీతం

Breaking News in Telugu down Latest News in Telugu Stock market: Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.