📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

Author Icon By Shobha Rani
Updated: July 2, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా విధించిన టారిఫ్‌ డెడ్‌లైన్‌ జులై 9 సమీపిస్తున్న వేళ ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి సూచీలపై (Stock market) కనిపించింది. దీంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోగా.. నిఫ్టీ 25,500 దిగువకు చేరింది.
టారిఫ్ డెడ్‌లైన్ ప్రభావం
సెన్సెక్స్‌ (Sensex) ఉదయం 83,790.72 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 83,697.29) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 83,935.01 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకుంది. చివరికి 287 పాయింట్ల నష్టంతో 83,409.69 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) సైతం 88.40 పాయింట్ల నష్టంతో 25,453.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.68గా ఉంది.

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి
బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బీఈఎల్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటి జాబితాలో ఉన్నాయి. టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ట్రెంట్‌, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 67.70 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3352 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Read Also: US: రష్యాతో వ్యాపారం మానేయండి.. భారత్‌కు అమెరికా ఆంక్షలు

Bajaj Finance Breaking News in Telugu Brent Crude BSE Crude Oil Prices Gold prices Google news Google News in Telugu HDFC Bank Indian Share Market Investor Caution July 2 2025 Stock News L&T Latest News in Telugu Market Closing Report Nifty NSE sensex Share Market News stock market Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Top Gainers Top Losers US Tariff Deadline USD to INR

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.