📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

Stock market : లాభాల్లో ముగిసిన స్టాక్‌ సూచీలు..

Author Icon By Shobha Rani
Updated: May 29, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపు లాభ- నష్టాల మధ్య చలించాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్లు అండతో తిరిగి పుంజుకున్నాయి. దీంతో మార్కెట్‌ (Stock market) ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 320 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 24,800 పైన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 81,591.03 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,312.32) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,106.98 – 81,816.89 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 320 పాయింట్ల లాభంతో 81,633 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 24,892.60 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 81 పాయింట్ల లాభంతో 24,833.60 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు 85.50 వద్ద ముగిసింది.

Stock market : లాభాల్లో ముగిసిన స్టాక్‌ సూచీలు..

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, ఎటర్నల్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్ పెయింట్స్‌, టీసీఎస్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 65.84 డాలర్ల వద్ద ట్రేడవగా.. బంగారం ఔన్సు 3,282 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Read Also: Wipro:డ్యూటీకి వచ్చిన ఉద్యోగులకు విప్రో భారీ షాక్

Breaking News in Telugu ended in profit. Google news Google News in Telugu Latest News in Telugu Stock indices Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.