భారత క్రికెట్ జట్టులో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఇప్పుడు కొత్త రంగంలో అడుగుపెట్టాడు. ఫుడ్ & హాస్పిటాలిటీ రంగంలో తన తొలి అడుగుగా, సోదరుడితో కలిసి హైదరాబాదులో ఓ లగ్జరీ రెస్టారెంట్ను ప్రారంభించాడు. బంజారాహిల్స్లో ప్రారంభమైన ఈ రెస్టారెంట్కు ‘JOHARFA’ అనే ప్రత్యేకమైన పేరు పెట్టారు. క్రికెట్ తర్వాత సిరాజ్ ఇష్టపడే రంగంగా ఫుడ్ బిజినెస్ను ఎన్నుకోవడం విశేషం.
వివిధ దేశాల వంటకాలకు వేదికగా జొహార్ఫ్త్
‘JOHARFA’ రెస్టారెంట్లో మొగల్, పర్షియన్, అరేబియన్ మరియు చైనీస్ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. లగ్జరీ డైనింగ్ అనుభూతిని ఇష్టపడే వారికి ఇది ఒక కొత్త చిరునామా అవుతోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇంటీరియర్, హైక్లాస్ మెనూ, బహుళ వంటకాల ఎంపికతో ఈ రెస్టారెంట్ ప్రస్తుతం హైదరాబాదీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సిరాజ్ అభిమానులు ఫుడ్ లవర్స్కి కూడా ఇది అట్రాక్షన్గా నిలుస్తోంది.
వైరల్ అవుతున్న వీడియో – అభిమానుల హర్షం
JOHARFA ప్రారంభ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సిరాజ్ సన్నిహితులు, క్రికెట్ వర్గాల నుంచి కొందరు ప్రముఖులు కూడా హాజరయ్యారు. తన కష్టాలను గుర్తు చేసుకుంటూ… నేడు బిజినెస్ రంగంలో అడుగుపెడుతున్న సిరాజ్పై అభిమానులు అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు. ఆటతో పాటు వ్యాపారంలోనూ విజయవంతంగా కొనసాగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Manchu Manoj: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ ప్రశంసల జల్లులు