దేశీయంగా బంగారం, వెండి ధరలు రోజురోజుకు కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి ధర సుమారు రూ.90,000 స్థాయిలో ఉండగా, ప్రస్తుతం ఏకంగా రూ.1.54 లక్షలు పెరిగి రూ.2,44,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్, పరిశ్రమల అవసరాలు, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వెండి ధరలకు ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Read also: Gold rate news : డిసెంబర్ 24 బంగారం ధరలు.. 24K గోల్డ్ కొత్త రికార్డు!
Silver Price Today
ఇదే ధోరణి కొనసాగితే సమీప భవిష్యత్తులో కేజీ వెండి ధర రూ.3,00,000 మార్క్ను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగారం ధరలు కూడా జోరుగా పెరుగుతున్నాయి. బుధవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,930గా నమోదవగా, త్వరలోనే రూ.1,50,000 స్థాయిని తాకే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: