📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

TCS ఉద్యోగులకు షాక్..

Author Icon By Sudheer
Updated: February 7, 2025 • 7:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (Q3) సంబంధించి సీనియర్ ఉద్యోగుల వేరియబుల్ పేను మరింత తగ్గించినట్లు సమాచారం. ఇది వరుసగా రెండోసారి తగ్గింపుగా ఉండడం గమనార్హం.

టీసీఎస్ మొదటి త్రైమాసికంలో ఉద్యోగులకు 70% వేరియబుల్ పే అందించగా, రెండో త్రైమాసికంలో 20-40% మాత్రమే ఇచ్చింది. తాజాగా మూడో త్రైమాసికంలో ఈ మొత్తాన్ని మరింత తగ్గించినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, వ్యయ నియంత్రణ చర్యలు ఈ నిర్ణయానికి కారణంగా చెప్పబడుతున్నాయి.

కంపెనీ నిర్ణయంతో ఉద్యోగులలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆఫీసుకు వచ్చి పూర్తిగా పని చేస్తున్నప్పటికీ వేతనంలో కోతలు పెడతారా? అనే ప్రశ్న ఉద్యోగులను వేధిస్తోంది. తాము అంచనా వేసుకున్న మొత్తానికి తక్కువగా వేరియబుల్ పే రావడంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

ఒక ఉద్యోగి తన అనుభవాన్ని షేర్ చేస్తూ, తనకు సాధారణంగా ₹50,000-₹55,000 వేరియబుల్ పే రావాల్సి ఉండగా, రెండో త్రైమాసికంలో సగమే అందిందని, ఇప్పుడు మూడో త్రైమాసికంలో మరింత తగ్గించారని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఉద్యోగుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టీసీఎస్ ఉద్యోగులకు వేరియబుల్ పేలో కోత విధించడం కొత్త విషయం కాదు. అయినప్పటికీ, వరుసగా రెండుసార్లు వేతనంలో కోత విధించడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సంస్థ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అన్న ప్రశ్న ఉద్యోగులను కంగారు పెడుతుంది.

Google news TCS TCS employees

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.