నూతన సంవత్సరం 2026 ప్రారంభంతో బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అలర్ట్ జారీ చేసింది. ఎక్కువ కాలంగా వాడని బ్యాంక్ ఖాతాలను గుర్తించి మూసివేసే ప్రక్రియను బ్యాంకులు ప్రారంభించనున్నాయి. డిజిటల్ మోసాలను నియంత్రించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.
Read also: Energy Efficiency:కేంద్రం కొత్త స్టార్ లేబులింగ్ విధానం అమలు
ఏ ఖాతాలు ప్రమాదంలో ఉన్నాయి?
రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు లేని డోర్మెంట్ ఖాతాలు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.
12 నెలలుగా వాడని ఇన్యాక్టివ్ అకౌంట్లపై బ్యాంకింగ్ సేవలు పరిమితం కావచ్చు.
దీర్ఘకాలంగా జీరో బ్యాలెన్స్తో ఉండి కేవైసీ అప్డేట్ చేయని ఖాతాలపై కూడా చర్యలు ఉండొచ్చు.
ఆర్బీఐ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
వాడుకలో లేని ఖాతాల ద్వారా డిజిటల్ మోసాలు, అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన ఆర్బీఐ భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యం.
ఖాతాదారులు ఏం చేయాలి?
మీ ఖాతా ద్వారా చిన్న లావాదేవీ అయినా చేయండి.
యూపీఐ పేమెంట్ లేదా ఏటీఎం విత్డ్రాయల్ సరిపోతుంది.
కేవైసీ వివరాలు అప్డేట్లో ఉన్నాయో లేదో బ్యాంకులో చెక్ చేసుకోండి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: