దేశవ్యాప్తంగా జీఎస్టీ విధానం మరోసారి చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఆహార పదార్థాలపై పన్నుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాదిలో ఎక్కువగా తినే ఇడ్లీ, దోశ పిండిపై 5% జీఎస్టీ విధిస్తుండగా, ఉత్తరాదిలో ప్రాచుర్యం పొందిన చపాతీ, పరోటాలపై మాత్రం పన్నులు తొలగించారని ఆరోపణలు వస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో కోట్లాది మంది రోజువారీ అల్పాహారంగా(breakfast) ఇడ్లీ, దోశ పిండిని వాడుతుంటారు. ఈ పిండిపై పన్ను విధించడం అన్యాయమని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు, చపాతీ, పరోటాలపై గతంలో ఉన్న పన్నును పూర్తిగా రద్దు చేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నిర్ణయం దక్షిణాదివారి ఆహారపు అలవాట్లను లక్ష్యంగా చేసుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

“ఉత్తరాది ఆహారంపై జీఎస్టీ లేకపోతే, దక్షిణాది ఆహారంపై ఎందుకు?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పన్నుల విధానంలో ఈ విధమైన తేడాలు ప్రజల మధ్య అసమానతలకు దారితీస్తాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు, ముఖ్యంగా దక్షిణాది ప్రజలపై అదనపు భారం పడుతోందని వాదన ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియా వేదికల్లో హాట్ టాపిక్గా(Hot topic) మారింది. జీఎస్టీ విధానాన్ని సమీక్షించి, సమానత్వం పాటించాలని కేంద్రాన్ని కోరుతూ చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ప్రస్తుతం వివాదం ఏ అంశంపై ఉంది?
జీఎస్టీ కింద ఆహార పదార్థాలపై పన్నులు విధించే విధానంలో ప్రాంతీయ వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలపై వివాదం చెలరేగింది.
ఏ ఆహార పదార్థాలపై పన్ను ఉంది?
ఇడ్లీ, దోశ పిండిపై 5% జీఎస్టీ విధించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: