ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం (Telecom giant) బీఎస్ఎన్ఎల్ మళ్లీ లాభాల దిశగా పరుగులు పెడుతోంది.గతంలో నష్టాలతో మునిగిపోయిన సంస్థ, ఇప్పుడు వరుసగా రెండో త్రైమాసికంలో లాభాల్లోకి వచ్చినది.2025 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.280 కోట్ల లాభం నమోదు చేసింది.గతేడాది ఇదే సమయంలో సంస్థ రూ.849 కోట్ల నష్టాన్ని చూసిన సంగతి తెలిసిందే.ఇది సాధించగలగడం వెనుక బీఎస్ఎన్ఎల్ (BSNL) చేస్తున్న క్రమశిక్షణతో కూడిన వ్యయ నియంత్రణ, 4G మరియు 5G సేవల విస్తరణ ఉండడం ప్రధాన కారణం.
మారుతున్న దిశ – సేవే లక్ష్యం
కేవలం లాభాలు రావడమే సంస్థ లక్ష్యం కాదు అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ఏ.రాబర్ట్ జే రవి చెప్పారు. “ప్రతి భారతీయుడికి అధిక నాణ్యతతో కూడిన కనెక్టివిటీ అందించడమే అసలైన లక్ష్యం” అని ఆయన స్పష్టంగా చెప్పారు.లాభాలంటే సేవలకు ఇచ్చే ప్రతిఫలం మాత్రమేనని, ప్రజల అవసరాలను తీర్చడమే తమ అసలైన విజయమని అభిప్రాయపడ్డారు.మూడవ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ రూ. 262 కోట్ల లాభం పొందింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో లాభాలు రావడం సంస్థ పునరుత్తానానికి సంకేతం.ఈ వృద్ధితో బీఎస్ఎన్ఎల్ ఏటా నష్టాన్ని తగ్గించగలిగింది. 2024లో రూ.5,370 కోట్ల నష్టం ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 2,247 కోట్లకు తగ్గింది.
ఆదాయంలో కూడా వృద్ధి
ఇది కేవలం లాభాల్లోనే కాదు, ఆదాయంలోనూ కనిపిస్తోంది.2024లో సంస్థ నిర్వహణ ఆదాయం రూ.19,330 కోట్లు కాగా, 2025లో అది రూ. 20,841 కోట్లకు పెరిగింది.అంటే 7.8 శాతం వృద్ధి సాధించింది. ఇది బీఎస్ఎన్ఎల్ సాధించగలిగిన స్థిరమైన పురోగతి గుర్తించడానికి ఉపయోగపడుతుంది.ఇప్పటి బీఎస్ఎన్ఎల్ విజయంలో 4G, 5G విస్తరణ కీలకం.గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించడమే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అధిక నాణ్యత, తక్కువ ధరతో సేవలు అందించి ప్రజలకు చేరువవుతోంది.
ప్రభుత్వం నుండి మద్దతు
ఈ పురోగతిపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు స్పందించారు.ట్విట్టర్ ద్వారా “బీఎస్ఎన్ఎల్ 18 ఏళ్లలో తొలిసారి వరుసగా లాభాల బాటలోకి వచ్చిందన్నది గర్వకారణం” అని తెలిపారు.బీఎస్ఎన్ఎల్ మళ్లీ తన నయా అవతారాన్ని చూపిస్తోంది. లాభాలు రావడం ఒక విజయం అయితే, సేవా నిబద్ధతను నిలబెట్టుకోవడం మరో గొప్ప మైలురాయి.ఇప్పుడు సంస్థ కేవలం ఒక టెలికాం కంపెనీ కాదు – ప్రజల అవసరాలకు స్పందించే భద్రమైన నెట్వర్క్ గా మారుతోంది.
Read Also : Cars Exports : భారతీయ కార్లకు పెరుగుతున్న డిమాండ్..