వామ్మో.. నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ విలువ రూ. 49 లక్షలు

Read Time:  1 min
nita ambani water bottle co
nita ambani water bottle co
FONT SIZE
GET APP

రిలయన్స్ అధినేత ముకేశ్ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ విలువ అక్షరాలా రూ.49 లక్షలు. నీతా అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్యగా, భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలలో ఒకరిగా పేరుగాంచారు. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు ఛైర్‌పర్సన్‌గా ఆమె సేవలందిస్తున్నారు. ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలకంగా పాల్గొంటూ, ఆరోగ్యం, విద్య, గ్రామీణ అభివృద్ధి, మరియు క్రీడా రంగాల్లో పెద్ద ఎత్తున కృషి చేస్తుంటారు. 1963లో ముంబైలో జన్మించిన ఈమె,
1985లో ముకేశ్ అంబానీ ని వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు: ఆకాష్, ఈషా, మరియు ఆనంత్.

ప్రపంచ కుబేరుడిగా పేరు తెచ్చుకున్న ముకేశ్ అంబానీ.భార్య అయ్యి ఉండి , అందరిలా ఉంటె ఏముంటుంది..అందుకే అన్నింట్లోనూ ఆమె ప్రత్యేకమని నిత్యం చెప్పకనే చెపుతుంది. తాజాగా ఆమె నీళ్లు తాగేందుకు 24 క్యారట్ల బంగారు సీసాను వాడతారని వారి సన్నిహిత వర్గాలు చెపుతున్నారు. ఆ వివరాల ప్రకారం.. డిజైనర్ ఫెర్నాండో ఆల్టమిరానో రూపొందించిన ఆ బాటిల్ విలువ రూ.49 లక్షల వరకూ ఉంటుంది. అందులో తాగే నీటిని ఫ్రాన్స్, ఫిజీ, ఐస్లాండ్ దేశాల్లో ప్రకృతిసిద్ధంగా లభించే నీటిని తెప్పించుకుంటారు. అందుకే దానికి అంత ఖరీదు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.