యూరప్ లోని పలు కీలక విమానాశ్రయాలపై జరిగిన భారీ సైబర్ దాడితో విమానయాన సేవలు అస్తవ్యస్తగా మారాయి. లండన్ హీత్రో, బ్రసెల్స్, బెర్లిన్ వంటి ప్రధాన విమానాశ్రయాలు ఈ దాడి ప్రభావానికి వేలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలకమైన ఆన్ లైన్ వ్యవస్థలు కుప్పకూలడంతో అనేక విమానాలు(Flights) ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్నింటిని రద్దు చేశారు.
సర్వీస్ ప్రొవైడర్లే లక్ష్యంగా దాడి
సైబర్ నేరగాళ్లు విమానాశ్రయాల సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకోవడంతో చెక్-ఇన్, బోర్డింగ్ వంటి ముఖ్యమైన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా బ్రసెల్స్ విమానాశ్రయంలో ఆటోమేటెడ్ చెక్-ఇన్, బోర్డింగ్ సిస్టమ్ లు పూర్తిగా పనిచేయడం లేదని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సైబర్ దాడి కారణంగా విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ప్రయాణికులు తమ విమాన సర్వీసుల(Airline services) తాజా సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థల వెబ్సైట్లను పరిశీలించాలని అధికారులు సూచించారు. దీనిపై అధికారులు స్పంక్షిస్తూ ‘మా సాంకేతిక సిస్టమ్ లను పునరుద్ధరించేందుకు నిరంతరం పనిచేస్తున్నాయి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు.
దాడి వల్ల ఏం జరిగింది?
ఎయిర్పోర్టు సిస్టమ్స్ పని చేయకపోవడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
ప్రయాణికులు ఎంతవరకు ఇబ్బందులు పడ్డారు?
టికెటింగ్, చెక్-ఇన్, బోర్డింగ్ వంటి ముఖ్య సేవలు నిలిచిపోవడంతో వేలాది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: