📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

M. Rama Rao: ఆరోగ్య బీమా.. కార్మికుల జీవితాలకు మరింత ధీమా: ఎం.రామారావు

Author Icon By Sharanya
Updated: July 24, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: కార్మికుల స్వాతంత్య్ర వేడుక వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖల కార్యక్రమాలు, పథకాలపై ప్రత్యేక శకటాల ప్రదర్శన (Tableaus) ఏర్పాటకు చర్యలు తీసుకోవాలని సమచారశాఖ అధికారులను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. అంతేగాక అభివృద్ధి సంక్షేమ పధకాల అమలుపై ముఖ్య అతిధి సందేశం, వివిధ ప్రసార మాద్యమాల ద్వారా వేడులపై లైవ్ కవరేజి తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలన చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి వివిధ శాఖలవారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఆగస్టు 15వ తేదీన మినిట్ టు మినిట్ కార్యక్రమం

ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్య్ర వేడుకల మినిట్ టు మినిట్ కార్యక్రమం గురించి వివరిస్తూ ఆరోజు ఉదయం 8.30 గం.లకు స్వాతంత్య్ర దినోత్సవ పేరేడ్ ప్రారంభం అవుతుందని 8.58గం.లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక వద్దకు చేరుకుంటారని ఉ.10.30 గం.ల వరకూ ఈవేడుకులు నిర్వహించే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా నూతన స్త్రీ ఆరోగ్య బీమా పథకం (Women’s Health Insurance Scheme)తో కార్మికుల జీవితాలకు ధీమా కల్పిస్తున్నామని ఈఎస్ఐసీ ప్రాంతీయ డైరెక్టర్ ఎం.రామారావు (M. Rama Rao) కోరారు. ఈ పథకాన్ని కర్మాగారాలు, సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. బుధవారం విజయవాడ, గుణదలలోని సంస్థ కార్యాలయంలో యజమానులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రమోషన్ పథకం (ఎస్పీఆర్ఈ 2025) ప్రచార పోత్తాన్ని ఈఎస్ఐసీ ప్రాంతీయ డైరెక్టర్ ఎం. రామారావు(M. Rama Rao) అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా సంస్థ 196వ సమావేశంలో స్త్రీ పథకానికి ఆమోదం లభించిందని, ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ కర్మాగారాలు, సంస్థలు స్వచ్చందంగా నమోదుకు ముందుకురావాలని సూచించారు.

ఈ పథకం కింద రాష్ట్రంలో 14 లక్షల మంది ఉద్యోగులు

ఈ పథకం ద్వారా యజమాని ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చెల్లుబాటయ్యేదిగా పరిగణించడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ ముందుకాలానికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదా ప్రయోజనం వర్తించదన్నారు. రిజిస్ట్రేషన్ ముందు కాలానికి ఎలాంటి తనిఖీ లేదా గత రికార్డుల కోసం డిమాండ్ చేయడం జరగదన్నారు. జరిమానాల భయాన్ని తొలగించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేసినట్లు వివరించారు. ఈ పథకం రాకముందు నిర్దిష్ట సమయంలోపు నమోదు చేసుకోకపోతే చట్టపరమైన చర్యలు, పాత బకాయిల డిమాండ్ తలెత్తే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఈ స్త్రీ పథకంతో ఆ అడ్డంకులు తొలగాయని, ఇప్పటివరకు నమోదుకాని కర్మాగారాలు, సంస్థలు తమ కార్మికులను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ పథకం వీలుకల్పిస్తోందని, త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 69,632 కర్మాగారాలు, సంస్థలు నమోదయ్యాయని, దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం కింద ఉన్నారని ఎం. రామారావు వివరించారు. కార్యక్రమంలో ఐఎంఎస్ డైరెక్టర్ వి. ఆంజనేయులు, స్టేట్ మెడికల్ ఆఫీసర్ డా. ఆర్. ప్రదీప్ కుమార్, కర్మాగారాల డైరెక్టర్ డి.చంద్రశేఖరవర్మ, బాయిలర్స్ డైరెక్టర్ బి. ఉమామహేశ్వరరావు, ఈఎస్ఐసీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ నవనీత్ పాల్గొన్నారు .

read hindi news: hindi.vaartha.com

Read also: Minister Narayana: అన్ని హంగులతో కూడినపార్క్ షటిల్ కోర్టును ప్రారంభించిన మంత్రి నారాయణ

Breaking News Health Insurance for Workers Labour Welfare Schemes latest news M. Rama Rao Telugu News Workers Security

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.