Latest News: Microsoft యూఎస్ లోని మైక్రోసాఫ్ట్‌ వద్ద నిరసన..18 మంది అరెస్ట్

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ రాష్ట్రంలోని రెడ్‌మండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కారణం – మైక్రోసాఫ్ట్‌, ఇజ్రాయెల్ ప్రభుత్వం (Israeli government) తో కుదుర్చుకున్న ఒప్పందాలు. ఆ ఒప్పందాల ద్వారా అందిస్తున్న టెక్నాలజీని గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కంపెనీ ప్రాంగణంలో ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, పౌరసమాజ ప్రతినిధులు కలిసి నిరసన ప్రదర్శనలు చేపట్టారు.ప్రతిపక్ష ధోరణి గట్టిగా వినిపించడంతో మొదట శాంతియుతంగా సాగిన ఆందోళన క్రమంగా తీవ్రరూపం దాల్చింది. సుమారు 35 మంది నిరసనకారులు మైక్రోసాఫ్ట్‌ కార్యాలయం బయట గుమికూడి నినాదాలు చేశారు. “గాజాకు న్యాయం చేయాలి”, “మైక్రోసాఫ్ట్‌ రక్తపాతం ఆపు” అంటూ పలకరించిన నినాదాలు చుట్టుపక్కల గట్టిగా మార్మోగాయి.

నిరసనకారులు కంపెనీ ప్రాంగణంలోని సైన్ బోర్డుపై

నిరసనకారుల్లో కొంతమంది కంపెనీ ప్రస్తుత ఉద్యోగులే కావడం విశేషం. వారితో పాటు మాజీ ఉద్యోగులు కూడా మద్దతుగా నిలబడ్డారు. తమ కంపెనీ సాంకేతికత మానవహక్కుల ఉల్లంఘనకు కారణం కాకూడదని, సంస్థ వెంటనే ఇజ్రాయెల్‌తో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.నిరసనకారులు కంపెనీ ప్రాంగణంలోని సైన్ బోర్డుపై రంగులు చల్లడం, పాదచారుల వంతెనను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు పలుమార్లు హెచ్చరించినా వారు వెనక్కి తగ్గలేదు. మొత్తం 18 మందిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.మైక్రోసాఫ్ట్ అభివృద్ధి (Developed by Microsoft) చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఇజ్రాయెల్ సైన్యం గాజా, వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్ల ఫోన్ కాల్ డేటాను సేకరిస్తోందని ఇటీవల ఓ బ్రిటిష్ వార్తాపత్రిక కథనం ప్రచురించింది.

Latest News
Latest News

ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడం

ఈ ఆరోపణలు తీవ్ర దుమారం రేపడంతో, మైక్రోసాఫ్ట్ దీనిపై అత్యవసర సమీక్ష జరుపుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఓ కన్సల్టింగ్ సంస్థను కూడా నియమించినట్లు తెలిపింది. అయినప్పటికీ, కంపెనీలో నిరసనలు ఆగలేదు.మైక్రోసాఫ్ట్‌లో ఇజ్రాయెల్ కాంట్రాక్టులకు సంబంధించి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడం ఇదే తొలిసారి కాదు. గత మే నెలలో సీఈవో సత్య నాదెళ్ల ప్రసంగానికి అడ్డుతగిలిన ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అలాగే, ఏప్రిల్‌లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఆటంకం కలిగించిన ఇద్దరు ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకున్నారు. తాము ఇజ్రాయెల్ సైన్యానికి టెక్నాలజీ అందిస్తున్న మాట వాస్తవమే అయినా, అది గాజాకు హాని కలిగించే ఉద్దేశంతో రూపొందించింది కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేస్తోంది.

మైక్రోసాఫ్ట్‌ స్థాపకులు ఎవరు?

మైక్రోసాఫ్ట్‌ను బిల్ గేట్స్, పాల్ ఆలెన్ 1975లో స్థాపించారు.

మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయం అమెరికా దేశంలోని వాషింగ్టన్ రాష్ట్రం, రెడ్‌మండ్‌ నగరంలో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-crime-news-genocide-in-nigeria-50-people-dead/breaking-news/533618/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.