📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

Stock market: స్టాక్‌ సూచీలకు ఐటీ, మెటల్‌, రియల్టీ షేర్ల మద్దతు

Author Icon By Shobha Rani
Updated: June 16, 2025 • 4:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలతో గత రెండు సెషన్లు నష్టాలు చవిచూసిన సూచీలు.. నేడు మళ్లీ పుంజుకొన్నాయి. ఓ వైపు ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న మన మార్కెట్లు (Stock market) రాణించడం విశేషం. ముఖ్యంగా ఐటీ, మెటల్‌, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు కలిసొచ్చింది.
కీలక సూచీల ముగింపు స్థాయిలు
సెన్సెక్స్‌ (Sensex) ఉదయం 81,034.45 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,118.60) నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపటికే కోలుకున్న సూచీ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 81,865.82 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి సెన్సెక్స్‌ (Sensex) 677.55 పాయింట్ల లాభంతో 81,796.15 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) సైతం

Stock market: స్టాక్‌ సూచీలకు ఐటీ, మెటల్‌, రియల్టీ షేర్ల మద్దతు

227.90 పాయింట్ల లాభంతో 24,946 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.04గా ఉంది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, ఎటర్నల్‌ షేర్లు ప్రధానంగా లాభడ్డాయి. టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా నష్టాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 73 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ఔన్సు 3435 డాలర్ల వద్ద ట్రెడైనది. ఈ స్థిరంగా ఉన్న క్రూడ్ ధరలు దేశీయ ఇంధన ధరలపై ఒత్తిడి తగ్గించే అవకాశం ఉంది. మరోవైపు బంగారం ధరల్లో పెరుగుదల సాధారణంగా మార్కెట్‌లో రిస్క్ సెంటిమెంట్‌ను సూచిస్తుంది. గత రెండు సెషన్లలో సూచీలు అమెరికా-యూరప్ మార్కెట్ల ప్రతికూలతల వల్ల నష్టాల్లోకి వెళ్లాయి. ఈ రోజు బలమైన కొనుగోళ్లు, మెటల్ & రియల్టీ షేర్లలో జోరు మార్కెట్‌ను పాజిటివ్ మూడ్‌లోకి తీసుకొచ్చాయి.

Read Also: Stock market: ఈ వారం మార్కెట్ కు ఫార్మా, ఐటీ షేర్లే కీలకం

Google news Google News in Telugu IT Latest News in Telugu metal Paper Telugu News realty shares support Stock indices Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.