భారత రూపాయి విలువ(rupee) వేగంగా క్షీణిస్తోంది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, విదేశీ పెట్టుబడిదారులు నిధులు ఉపసంహరించుకోవడం వంటి కారణాలతో రూపాయి పతనం ఆగడం లేదు. తాజాగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 91 మార్క్ను(Indian Markets) దాటి కొత్త జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత సెషన్లో 90.78 వద్ద ముగిసిన రూపాయి, ఈ రోజు ప్రారంభంలోనే మరింత బలహీనపడి 36 పైసలు తగ్గి 91.14 స్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో ఇది 100 స్థాయికి చేరే అవకాశముందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
Read Also: Stock Markets: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…
నిఫ్టీ మళ్లీ 26 వేల దిగువకు
రూపాయి పతనం ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా తీవ్రంగా పడింది. దేశీయ సూచీలు మరోసారి భారీ నష్టాల్లోకి జారాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కీలక స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ 534 పాయింట్లు తగ్గి 84,680 వద్ద ముగియగా, నిఫ్టీ 167 పాయింట్లు పడిపోయి 25,860 వద్ద క్లోజ్ అయింది. రెండు వారాలుగా విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం మార్కెట్పై ఒత్తిడిని పెంచాయి.
స్టాక్స్, సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి
సెన్సెక్స్లోని 30 షేర్లలో 23 నష్టాలతో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, జొమాటో షేర్లు దాదాపు 5 శాతం పడిపోగా, టైటాన్, ఎయిర్టెల్ సుమారు 2 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ 50లో 39 షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, రియల్టీ, మెటల్, ఆటో, ఫార్మా రంగాల్లో అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి. మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మాత్రం కొంత లాభంతో నిలిచాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ నెగెటివ్ ట్రెండ్
ప్రపంచ మార్కెట్లలో కూడా నష్టాలే ఆధిపత్యం చెలాయించాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.24 శాతం తగ్గి 3,999 వద్ద, జపాన్ నిక్కీ 1.56 శాతం పడిపోయి 49,383 వద్ద ముగిసింది. హాంకాంగ్ హాంగ్సెంగ్ సూచీ 1.54 శాతం తగ్గి 25,235 వద్ద, చైనా షాంఘై కాంపోజిట్ 1.11 శాతం పడిపోయి 3,825 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్లలోనూ(Indian Markets) నెగెటివ్ ధోరణే కనిపించింది. డిసెంబర్ 15న డౌ జోన్స్ స్వల్పంగా 0.086 శాతం తగ్గి 48,416 వద్ద ముగియగా, నాస్డాక్ కాంపోజిట్ 0.59 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.16 శాతం నష్టపోయాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: