📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India-US: ఈ నెలలోనే భారత్‌-అమెరికా మధ్యంతర ట్రేడ్‌ డీల్‌!

Author Icon By Shobha Rani
Updated: June 11, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టారిఫ్‌ల తగ్గింపు, మార్కెట్‌ అందుబాటు, డిజిటల్‌ వాణిజ్యం పెంపు దిశగా భారత్‌-అమెరికా మధ్య జరుగుతున్న చర్చల్లో (India-US Trade Deal) మెరుగైన పురోగతి లభించింది. మరికొన్ని వారాల్లో ఇరుదేశాల మధ్య మధ్యంతర ట్రేడ్‌ డీల్‌ (Trade Deal) కుదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న 190 బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని.. 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య అంశాలపై ఇరుదేశాల ప్రతినిధుల మధ్య దిల్లీ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన చర్చలు మంగళవారంతో ముగిశాయి. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ అందుబాటు, సుంకాలు తగ్గింపు, టారిఫ్‌ (Trump Tariffs) మినహాయింపులు వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఈ చర్చలు సాగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా సమతుల్య ఒప్పందం దిశగా చర్చల్లో పురోగతి లభించినట్లు పేర్కొన్నాయి.

India-US: ఈ నెలలోనే భారత్‌-అమెరికా మధ్యంతర ట్రేడ్‌ డీల్‌!

వ్యవసాయ డిమాండ్లకు భారత్ తిరస్కారం
కాగా.. ఈ చర్చల్లో వ్యవసాయ దిగుమతులకు సంబంధించి అమెరికా చేసిన డిమాండ్లను భారత్‌ తిరస్కరించినట్లు సమాచారం. ఇక, ఉక్కుపై వాషింగ్టన్‌ విధించిన 50శాతం సుంకం నుంచి భారత్‌ను మినహాయించాలని మన ప్రతినిధులు కోరారు. దానికి బదులుగా అమెరికా నుంచి సీఎన్‌జీ, క్రూడ్‌ ఆయిల్‌, బొగ్గు దిగుమతులను పెంచుకుంటామని న్యూదిల్లీ చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి సీఎన్‌జీ, క్రూడ్ ఆయిల్, బొగ్గు దిగుమతులను పెంచుతామని భారత్ ప్రతిపాదించింది.
జీ7 సదస్సులో కీలక సమావేశం?
జూన్‌ 15-17 మధ్య కెనడా వేదికగా జీ7 సదస్సు జరగనుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) హాజరుకానున్నారు. ఆ సదస్సు అనుబంధంగా వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉంది. అందులోనే వాణిజ్య ఒప్పందంపై వీరు చర్చించుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత మధ్యంతర ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సదస్సు సందర్భంగా భారత్-అమెరికా నేతల మధ్య ప్రత్యక్ష భేటీ జరగే అవకాశముంది. ట్రేడ్ డీల్‌పై నిర్ణయం అదే సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జూన్‌ నెలలోనే ఇంటర్మీడియట్ ట్రేడ్ డీల్ (Interim Trade Deal) అధికారికంగా ప్రకటించబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Also: Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Breaking News in Telugu deal this month! Google news India-US interim trade Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.