పండగ సీజన్ ప్రభావం జీఎస్టీ ఆదాయం కొత్త గరిష్ఠం
దేశవ్యాప్తంగా పండుగల సందడి ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం చూపించింది. అక్టోబర్ నెలలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు కొత్త రికార్డును సృష్టించాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే జీఎస్టీ ఆదాయం 4.6 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరింది. ఇది వరుసగా పదో నెల రూ. 1.8 లక్షల కోట్ల మార్కును అధిగమించడం విశేషం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జీఎస్టీ వసూళ్లు 9 శాతం పెరిగి రూ. 13.89 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 12.74 లక్షల కోట్లుగా ఉంది. రీఫండ్లను మినహాయిస్తే, అక్టోబర్లో నికర వసూళ్లు రూ. 1.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
Read also: పాపం అనిల్ అంబానీకి దెబ్బ మీద దెబ్బ
ప్రత్యక్ష పన్నుల వసూళ్లలోనూ బలమైన వృద్ధి సంకేతాలు
సెప్టెంబరులో జీఎస్టీ (GST) రేట్లను సరళీకరించడం, పండగ సీజన్లో వినియోగం పెరగడం వంటి అంశాలు ఈ వృద్ధికి దారితీశాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. వినియోగదారులకు తగ్గింపుల ప్రయోజనం అందడంతో కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ఈ సీజన్లో వినియోగం 10 శాతానికి పైగా పెరిగి, సుమారు రూ. 20 లక్షల కోట్ల మేర అదనపు వ్యయం జరిగే అవకాశం ఉందని అంచనా. కేపీఎంజీ ఇండియా భాగస్వామి అభిషేక్ జైన్ మాట్లాడుతూ, పండగ సీజన్లో పెరిగిన వినియోగం, పన్ను చెల్లింపుల్లో క్రమశిక్షణ, పారదర్శక విధానాలు ఇవన్నీ జీఎస్టీ వసూళ్లలో బలమైన వృద్ధికి దోహదపడ్డాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిర దిశలో సాగుతోందనే సూచన అని అన్నారు.
అదేవిధంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కూడా వృద్ధి కనిపిస్తోంది. అక్టోబర్ 12 నాటికి నికర ప్రత్యక్ష పన్నులు 6.33 శాతం పెరిగి రూ. 11.89 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో కార్పొరేట్ పన్ను రూ. 5.02 లక్షల కోట్లు, వ్యక్తిగత పన్ను రూ. 6.56 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: