రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ వెండి ఆభరణాలు, వెండి నాణేలపై కూడా రుణాలు మంజూరు చేయడానికి అనుమతి(GOOD NEWS) ఇచ్చింది. ఇప్పటివరకు బ్యాంకులు బంగారు తాకట్టు పద్ధతిలోనే రుణాలు ఇస్తుండగా, ఇకపై వెండిపైనా అదే విధానం అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. దీని ద్వారా బంగారం కొనలేని మధ్యతరగతి, గ్రామీణ కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభించనుంది.
Read also: పైకప్పు కూలి ఒకే కుటుంబం ఐదుగురు మృతి

కొత్త మార్గదర్శకాల వివరాలు
ఆర్బీఐ(GOOD NEWS) విడుదల చేసిన మార్గదర్శకాల్లో తాకట్టు పరిమితులు, లోన్ విలువ, తిరిగి అప్పగింత విధానం వంటి అంశాలపై స్పష్టమైన నియమాలు ఉన్నాయి.
తాకట్టు పరిమితులు
- వెండి ఆభరణాలు: గరిష్టంగా 10 కిలోల వరకు మాత్రమే తాకట్టు పెట్టవచ్చు.
- వెండి నాణేలు: ఒక్కో రుణగ్రహీతకు గరిష్టంగా 500 గ్రాముల వరకు మాత్రమే అనుమతి.
- ఈ పరిమితులు అన్ని బ్యాంకు శాఖలకు వర్తిస్తాయి, అంటే ఒకే వ్యక్తి వివిధ బ్రాంచ్లలో కలిపి ఈ పరిమితిని మించకూడదు.
లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తి
తాకట్టు వెండి విలువను బట్టి బ్యాంకులు ఇవ్వగల రుణ పరిమితిని ఆర్బీఐ నిర్ధారించింది:
- ₹2.5 లక్షల వరకు రుణాలకు వెండి విలువలో 85% వరకు రుణం
- ₹2.5 లక్షల నుండి ₹5 లక్షల వరకు వెండి విలువలో 80% వరకు
- ₹5 లక్షలకు మించి గరిష్టంగా 75% వరకు రుణం
వెండి విలువ నిర్ధారణ
తాకట్టు పెట్టే సమయంలో, రుణగ్రహీత సమక్షంలోనే వెండి విలువ అంచనా వేయాల్సి ఉంటుంది. పారదర్శకత కోసం ఆ బ్యాంకులు సర్టిఫైడ్ విలువ నిర్ణయకులను నియమించాల్సి ఉంటుంది.
తిరిగి అప్పగింత
రుణం పూర్తిగా చెల్లించిన తరువాత, బ్యాంకులు గరిష్టంగా 7 పని దినాల్లో వెండిని తిరిగి ఇవ్వాలి. ఆలస్యమైతే, ప్రతి రోజు ₹5,000 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
వేలం ప్రక్రియ
రుణం చెల్లించని పరిస్థితిలో బ్యాంకులు వెండిని వేలం వేయవచ్చు, కానీ దానికి ముందు రుణగ్రహీతకు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. వేలం రిజర్వ్ ధర మార్కెట్ విలువలో కనీసం 90% ఉండాలి. వేలం ద్వారా వచ్చిన అదనపు మొత్తాన్ని 7 రోజుల్లోపు రుణగ్రహీతకు తిరిగి ఇవ్వాలి.
మధ్యతరగతి, గ్రామీణ ప్రజలకు ఉపశమనం
బంగారం కొనలేని చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు సాధారణంగా వెండి ఆభరణాలు, నాణేలు కొనుగోలు చేస్తారు. ఇప్పటి వరకు వీటిని తాకట్టు పెట్టి రుణం పొందే అవకాశాలు బ్యాంకింగ్ వ్యవస్థలో లేవు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే, వారికి తక్షణ ఆర్థిక అవసరాల కోసం వెండిని ఉపయోగించి రుణం పొందే అవకాశం లభిస్తుంది.
ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని “సామాజిక ఆర్థిక సమానత్వం” దిశగా ఒక కీలక అడుగుగా పేర్కొంది. చిన్న వ్యాపారులు, మహిళలు, రైతులు వంటి వర్గాలకు ఇది పెద్ద సహాయం కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: