TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

Read Time:  1 min
TTD: టిటిడి వినూత్న ఆలోచన ఆచరణ సాధ్యమేనా!?
TTD: టిటిడి వినూత్న ఆలోచన ఆచరణ సాధ్యమేనా!?
FONT SIZE
GET APP

తిరుమల శ్రీవారి భక్తులకు తితిదే (TTD) గుడ్ న్యూస్ అందించింది. భక్తులకు అందిస్తున్న అన్నదాన కార్యక్రమంలో నేటి నుంచి రాత్రి భోజనంలో మసాలా వడలను వడ్డించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనంలో మాత్రమే వడలు ఇచ్చేవారు. ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వేడి వేడి మసాలా వడలు అందించనున్నారని టిటిడీ ప్రకటించింది.

దినసరి వడ్డింపు భారీగా పెంపు

ప్రస్తుతం మధ్యాహ్న భోజనంలో రోజుకు 30 వేల నుంచి 35 వేల వడలు వడ్డిస్తుండగా, ఇప్పుడు మొత్తం రోజుకు 70 వేల నుంచి 75 వేల వడలు వడ్డించనున్నట్లు వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా వడల తయారీ మరియు సరఫరాలో పెంపు చేస్తూ, వారికి మెరుగైన సేవలు అందించడమే టిటిడీ లక్ష్యమని తెలిపారు.

ఉల్లి, వెల్లుల్లిలేని స్వచ్ఛమైన వడలు

భక్తుల ఆధ్యాత్మికతను దృష్టిలో ఉంచుకొని, మసాలా వడలను ఉల్లి, వెల్లుల్లి లేకుండా తయారు చేస్తున్నారు. వీటిలో పప్పులు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలు మాత్రమే వాడుతున్నట్లు తెలిపారు. తద్వారా శుద్ధత, రుచికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా వడలు తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. ఈ నిర్ణయం భక్తులందరినీ ఆనందానికి లోనుచేస్తోంది.

Read Also : teacher : టీచర్ పై దాడిచేసిన తల్లిదండ్రులు!

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.